TRS MLAs Buying Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సైబదాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుుల ముగ్గురు సైబదాబాద్ పోలీసుల ఎదుట హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు తీర్పు.. సైబరాబాద్ పోలీసులకు అనుకూలంగా తీర్పు రావడంతో నిందితులు ముగ్గురు రామచంద్ర భారతి స్వామిజీ అలియాస్ సతీష్ శర్మ, నందకుమార్ లను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించే ఏర్పాట్లలో పోలీసులు నిమగ్నమై ఉండగా, బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన వవ్యహరంపై దర్యాప్తును సీట్ లేదా సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ నవంబర్ 4వ తేదీ వరకూ దర్యాప్తుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.