Samantha: హీరోయిన్ సమంత జీవితంపై దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. గత ఏడాది అక్టోబర్ నెలలో నాగచైతన్యతో విడాకులు తీసుకోగా.. ఈ ఏడాది అక్టోబర్ మాసంలో ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత తెలియజేసింది. కొన్ని నెలల క్రితం నేను మయోసిటీస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్తో బాధపడుతున్నాను.. దీన్ని త్వరలో జయిస్తాను అని స్పష్టం చేసింది. అదేవిధంగా “యశోద” ట్రైలర్ కి అద్భుతమైన స్పందన మీ నుండి లభించింది. ట్రయిలర్ పై మీ స్పందన మరియు చూపించిన ప్రేమ అన్నిటిని బట్టి నా ఈ పరిస్థితిని మీ ముందుకు తీసుకొస్తున్నాను.
మీరిచ్చే ధైర్యం మరియు శక్తి.. ముందున్న ఈ సవాళ్లను అధిగమిస్తాను అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాధి నయం కావాలంటే చాలా టైం పడుతుంది. మయోసిటీస్ వ్యాధితో చాలా పోరాడుతున్నాను. ఇదే సమయంలో త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా నా జీవితంలో మంచి రోజులు ఇంకా చెడ్డ రోజులు వచ్చాయి. అదే విధంగా ఈ వ్యాధి నుండి నయం కావడానికి మరో రోజు కూడా ఉందని నేను భావిస్తున్నాను.
అదేవిధంగా మరో రోజు నేను ముందుకు వెళ్లలేను అని అనుకున్న సమయంలో అది కూడా ఒక క్షణం లాగా గడిచిపోతుంది అంటూ.. చాలా ఎమోషనల్ పోస్ట్ పెట్టి చివరన ఐ లవ్ యు అని “ఇట్ షాల్ టు పాస్” అని సమంత తెలియజేయడం జరిగింది. సమంత పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధనలు చేస్తున్నారు. ఇదే సమయంలో కామెంట్ల రూపంలో ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!