TRS MLAs Buying Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, నందకుమార్, సింహయాజీలను పోలీసులు గురువారం రాత్రి మెజిస్ట్రేట్ ముందు హజరుపర్చగా రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన సంగతి తెలిసిందే. నిందితులకు సీఆర్పీసీ 41 ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని పేర్కొంది. అయితే దీనిపై పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సైబదాబాద్ పోలీసులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితులు ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ పై జస్టిస్ సుమలత నేతృత్వంలోని ధర్మాసనం ఈ మధ్యాహ్నం 2.30 గంటల తర్వాాత విచారణ జరపనుంది. మరో పక్క ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ లేదా సీబీఐ ద్వాార విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉంది. ఈ పిటిషన్ కూడా ఇవేళ విచారణ జరిగే అవకాశం ఉంది. అటు బీజేపీ, ఇటు సైబరాబాద్ పోలీసులు ఈ కేసు విషయంపై హైకోర్టును ఆశ్రయించడంతో ఏమి జరుగుతుంది ఆసక్తి సర్వత్రా నెలకొంది. సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలతో పాటు నిందితుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ బిగ్ ప్లాన్ .. భారీ పోలీస్ ఆపరేషన్ .. బిగ్ ఫ్లాప్..!!