Eatela Rajendar: తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనపై సంచలన నిర్ణయం తీసుకోవడం , దానికి తగినట్లే ఈటల రాజేందర్ స్పందిస్తుండటంతో ఇప్పుడు ఏం జరగబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలోనే టీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఎపిసోడ్ మారింది.
పుట్ట మధు ఎక్కడ?
పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు గత కొద్దిరోజులుగా పార్టీ నేతలకు , ప్రజలకు అందుబాటులో లేరు. అసలు ఈ నేత ఎక్కడున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో పెద్దపల్లి జిల్లా మంథనిలో టీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ…అలాగే అధిష్టానంతో పుట్ట మధు టచ్ లొనే ఉన్నారు అని తెలిపారు. పుట్ట మధు పై కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవం అని అన్నారు. ఆయన అనారోగ్య రీత్యా రెస్ట్ తీసుకుంటున్నారని, కార్యకర్తలు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన పని లేదు అని పేర్కొన్నారు. రెండు రోజులలో కార్యకర్తలకు అందుబాటులో పుట్టా మధు ఉంటారు అని తెలిపారు.
ఈటల కంటే ఎక్కువ టెన్షన్….
గతంలో న్యాయవాద దంపతుల హత్య ఉదంతంలో పుట్ట మధు పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే , ఈప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఫోర్త్ ఎస్టేట్ గా బావించే మీడియా ఒకసారి ఆలోచించాలని, కొంతమంది ఎప్పుడు పుట్ట మధును అరెస్టు చేస్తారని చూస్తున్నారని ఆయన అన్నారు. పేద బిడ్డ జడ్పీ చైర్మన్ అయితే సహించలేక పోతున్నారని ఆయన అన్నారు. అలా సంచలన పరిణామాలతో వార్తల్లో నిలిచిన పుట్ట మధు తాజాగా ఈ సంచలన ఎపిసోడ్ తో వార్తల్లో నిలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.