TSRTC: పల్లె వెలుగు బస్సు టికెట్ల ధరల్లో స్వల్ప మార్పులు చేస్తూ టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు టికెట్ల చార్జీలను రౌండప్ చేసింది. చిల్లర సమస్య తొలగించేందుకు టికెట్ ధరలను రౌండప్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రూ.12 లు ఉన్న టికెట్ చార్జీని రూ.10లకు తగ్గించారు. రూ.13, రూ.14లు ఉన్న టికెట్ చార్జీని రూ.15లకు పెంచారు. 80 కిలో మీటర్ల దూరానికి రూ.67 లు ఉన్న చార్జీని రూ.65లు గా నిర్ణయించింది ఆర్టీసీ.
TSRTC: టోల్ ప్లాజాల వద్ద ఒకటి రెండు రూపాయలు
ఇక టోల్ ప్లాజాల వద్ద ఆర్జినరీ బస్సులో ఒక రూపాయి, హైటెక్, ఏసి బస్సులకు రూ.2లు అదనంగా ప్రయాణీకుల నుండి వసూలు చేయాలని నిర్ణయించారు. సవరించిన చార్జీలను తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని లాభాల బాటలో పెట్టేందుకు ఎండీ సజ్జనార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రయాణీకులను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఆఫర్లు ప్రకటించడంతో పాటు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.