ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. నదీ పరివాహన ప్రాంతాల్లో అనేక గ్రామాలు వరద నీటితో మునిగాయి. దీంతో సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చురుగ్గా పాల్గొంటున్నాయి. అయితే కొమురం భీం జిల్లాలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఇద్దరు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు అయి దుర్మరణం చెందడం చూపరులను కలచివేసింది. దేహేగాంలో వరద సహాయ చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన రెస్క్యూ బృందంలోని ఇద్దరు మరణించారు.
కొమురం భీం జిల్లా దహేగాం మండలంలోని పెసరగుంట వాగు ఉదృతంగా ప్రవహిస్తుండగా సహాయక చర్యల కోసం సింగరేణి సంస్థ రెస్క్యూ టీమ్ ను పంపింది. రెస్క్యూ టీమ్ లోని సతీష్, రాములు ఇద్దరూ ఒక గర్బిణిని వాగు దాటించే క్రమంలో వాగు ఉదృతికి కొట్టుకుపోయారు. గల్లంతైన వీరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా వారి మృతదేహాలు లభ్యమైయ్యాయి. మృతులు ఇద్దరూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో విధులు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్ల విషాదఛాయలు అలుముకున్నాయి.
రవాణా వాహన యజమానులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ .. మ్యాటర్ ఏమిటంటే..?