Antharangalu: తెలుగు ఆడియన్స్ కు సీరియల్స్ అంటే ఎంత మక్కువ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరో మాటలో చెప్పాలంటే పిచ్చి. సినిమాలను పక్కన పెట్టి ఎగబడి చూసే సీరియల్స్ లో ఏం కాన్సెప్ట్ ఉంటుందో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ చాలా ఎట్రాక్ట్ అవుతారు. వారు ఏడిస్తే సీరియల్స్ చూసే వారు కూడా కంటతడి పెట్టుకుంటూ ఉంటారు. అంతలాగా ఎడిట్ అవుతారు మరి సీరియల్స్ కి. ఇక అలా కొన్ని సీరియల్స్ మాత్రమే ప్రేక్షక ఆదరణ దక్కించుకోగలరు. అలా దక్కించుకున్న సీరియల్స్ లోని యాక్ట్రెస్ కూడా ప్రేక్షకులకి చెరస్థాయిలో నిలిచిపోతారు. వారు ఇండస్ట్రీని వదిలి బయటికి వెళ్లిపోయినప్పటికీ వారి గురించి నిత్యం అప్డేట్స్ను తెలుసుకుంటూ సంతృప్తి పొందుతారు తమ ఫ్యాన్స్. అలా ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లినవారు ఎంతోమంది ఉన్నారు.
అలా అని వారిని వదిలేయకుండా వారి రోజువారి అప్డేట్లను చూసుకుంటూ ఎప్పుడు సీరియల్స్ లోకి వస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు ఫాన్స్. కొన్ని సంవత్సరాల పాటు ఆ సీరియల్స్ ప్రసారమైనప్పటికీ ఏమాత్రం విసుకు చెందకుండా వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఇక వారికి తగ్గట్లుగానే సీరియల్ మేకర్స్ కూడా ఎమోషన్స్ దట్టంగా పెడుతుంటారు. వన్స్ మోర్ ఒక్కసారి తమ సీరియల్ కి కనెక్ట్ అయ్యారంటే మళ్ళీ వదలరని ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉంటారు. అలా కంటతడి పెట్టిస్తూ నెంబర్ వన్ ప్లేస్ కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో కార్తీకదీపం అంతకుముందు మొగలిరేకులు సీరియల్స్ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకునేది. దానికి ముందు చక్రవాకం. ఇలా చాలామందికి మోస్ట్ ఫేవరెట్ సీరియల్స్ ఉంటాయి.
ఇలా ప్రేక్షకుల మదిలను గెలుచుకున్న సీరియల్స్ టాపిక్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మాత్రం ఈటీవీలో ప్రసారమైన కళంకిత గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. సీరియల్స్ కి కూడా అభిమానులు ఉంటారని ప్రూవ్ చేసిన సీరియల్ ఇది. ఆ రోజుల్లో ఈ సీరియల్స్ సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఇప్పటికీ వాటిని గుర్తు చేసుకుంటే గూజ్ బంప్స్ వస్తాయి అని చెప్పొచ్చు. ఇక అంతరంగాలు సీరియల్ కూడా అప్పట్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ రెండు సీరియల్స్ లో కూడా ప్రధాన పాత్ర పోషించిన అశ్వినికి అప్పట్లో ఎంతో ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల లాగానే కనిపించే అశ్విని యాక్టింగ్ ని చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యేవారు. ఆమె ఏడుస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టేవారు. నవ్వితే నవ్వే వారు. అలాంటి అశ్విని సీరియల్స్ అనంతరం మళ్లీ కనిపించకుండా ఇండస్ట్రీకి దూరమైంది.
దీంతో ఈ ముద్దుగుమ్మ ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది? అని ఇప్పటికే చాలామంది ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ ముద్దుగుమ్మ నిజానికి ఓ మలయాళం అమ్మాయి. కానీ అచ్చం తెలుగు అమ్మాయి లాగానే ఉంటుంది. ఈమె అసలు పేరు రుద్ర. భారత రాజా డైరెక్ట్ చేసిన పుడిమిల్లు పొద్దునాదు అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తమిళ్, మలయాళం చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. జయసుధ తో ఆంటీ, చిరంజీవితో హిట్లర్, శ్రీహరి తో పోలీస్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అనంతరం సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. ఇక ఇంకొన్నాళ్ళకు స్టార్ స్టేటస్ అందుకుంది. అందులోనూ అంతరంగాలు, కళంకిత సీరియల్స్ ఈమెకి మంచి పాపులారిటీ ఇచ్చాయి. ఇక ఆ తరువాత సింగపూర్ వెళ్లిన అశ్విని ప్రస్తుతం అక్కడ నటిస్తుంది. ఇక ఒకప్పుడు యావరేజ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో మాత్రం సూపర్ ఫిగర్ గా మారింది. తన గ్లామర్ను మరింత పెంచేసి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ప్రజెంట్ ఈమె ఫోటోలు చూసిన వారంతా ఈమె నా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!