NewsOrbit
టాప్ స్టోరీస్ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి సాక్షిగా జగన్ నయా స్కెచ్.. దీన్ని ఆపడం కష్టమే!

అమరావతి : రాజధాని అమరావతి విషయంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది ఏమి ఆలోచిస్తున్నారు? మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నారా? వేరే ఆలోచన చేస్తున్నారా? రాజధాని వివాదంలో హైకోర్టు తీర్పు ఆ ప్రాంత రైతులకు అనుకూలంగా వస్తుందా? జగన్ సర్కార్ కు అనుకూలంగా వస్తుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.

వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడి పనులు అక్కడితో నిలిచిపోయిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ భవన నిర్మాణాలపై సమీక్షలు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యత మారిపోయింది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ఆ ప్రాంత ప్రజలు, రైతాంగం ఆందోళనలు చేయడం, నిరసనలు కొనసాగించడం తెలిసిందే. అయితే ఈ ఆందోళనలు, నిరసనలు టీడీపీ ప్రేరేపితమని వైసీపీ కొట్టిపారేస్తుంది. అమరావతి ప్రాంతంలో భూములను పేదలకు ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే చట్టపమైన చిక్కుల నేపథ్యంలో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది.

అమరావతి ప్రాంతీయులకు శుభ వార్తేనా

మరో పక్క అమరావతి ప్రాంత ప్రజానీకం, రైతులు ఎగిరి గంతేసే వార్త ఒకటి లీక్ అయింది. అదేమిటంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణాలపై సమీక్షించి, 70 శాతం నిర్మాణాలు జరిగిన ప్రాజెక్టుల ను పూర్తి చేయాలని సూచించారట. ఇది నిజమైతే అమరావతి ప్రాంతం వారు సంతోషించే వార్తే. అమరావతిలో రాజధానికి అనుకూలమైన సరైన సదుపాయాలు, శాశ్విత భవనాలు గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, గ్రాఫిక్స్ తో కాలం వెళ్లదీశారని ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు విమర్శిస్తూ వచ్చారు.

ఇది దేనికి సంకేతం

ఇక్కడ చెప్పుకోవాల్సిందే విషయం ఏమిటంటే… తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి తొలుత దాదాపుగా ఏడున్నర కోట్ల రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టడానికి జీవోలు ఇచ్చారు. విశాఖకు పరిపాలనా రాజధానిని మార్చాలనుకున్న తర్వాత ఆ జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఇటీవల మళ్ళీ వీవీఐపీ ఇళ్ల ఖర్చు కోసం అంటూ ఏడున్నర కోట్ల రూపాయలతో కొత్త జీవోలు ఇచ్చారు. అయితే అవి సీఎం ఇంటి కోసమేనని అనుకుంటున్నారు. గతంలో అపేసి మరీ ఇప్పుడు ఖర్చు పెట్టడం, అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని అనుకోవడం దేనికి సంకేతం? మారుతున్న ప్రభుత్వ వ్యూహానికి సంకేతమా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju