Eluka Jemudu: ప్రకృతి లో ఎన్నో మొక్కలు వాటి లో ఎన్నో ఔషధ గుణాలు.. ఇప్పుడు మనం చెప్పబోయే మొక్కను అక్కడక్కడా చూస్తూనే ఉంటాము.. ఇది పల్లెటూళ్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.. అదే ఎలుక జముడు, ఎలుక చెవి ఆకు చెట్టు..!! ఈ ఎలుక చెవి ఆకు నేల మీద పాకుతూ అల్లుకుంటుంది.. అయితే ఈ ఎలుక చెవి ఆకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..!! అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..!!
Eluka Jemudu: ఎలుక జముడు మొక్క తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!!
నులిపురుగుల సమస్య తో బాధపడుతున్న వారు బియ్యప్పిండిలో, ఎలుక చెవి ఆకు రసాన్ని, సైంధవ లవణాన్ని, విడంగాలను చేర్చి రొట్టెల చేసుకుని నల్ల బొగ్గులు కాల్చుకొని ఆ రొట్టెలను తింటే కడుపులో నులి పురుగులు పోతాయి. కడుపులో నొప్పి తగ్గిపోతాయి. గర్భం నిలబడటానికి ఎలుక చెవి రసాన్ని చెరుకు రసంతో కలిపి తాగితే గర్భస్రావం జరగదు. గర్భం నిలబడుతుంది. కంటి సమస్యలు ఉన్నవారు ఈ ఆకులను కూర వండుకుని తింటే నేత్ర సమస్యలు తగ్గిపోతాయి.
ఎలుక కొరికితే ఈ ఆకు రసాన్ని ఒక చెంచా తాగాలి. అలాగే ఎలుక కొరికిన చోట ఈ ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేస్తే ఎలుక కాటు త్వరగా తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని, దో ప్రాస రసంతో తీసుకుంటే మూత్ర సమస్యలు తగ్గిపోతాయి. ఎలుక చెవి ఆకు రసంతో, భావంచలా చూర్ణం కలిపి నెయ్యి తో కలిపి తీసుకుంటే చర్మ రోగాలు తగ్గిపోతాయి. ఈ ఆకుల రసాన్ని గోమూత్రం లో కలిపి తాగినా కూడా చర్మ సంబంధిత సమస్యలు రావు.
ఈ మొక్క మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ సి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎలక జముడు మొక్క క్యాన్సర్ ను నివారించడం లో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. ఎలక జముడు మొక్క మూత్రంలో మంట, మూత్రం సరిగా రాకపోవడం, అన్ని రకాల మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. కిడ్నీ లో రాళ్లను కరిగించడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి, పార్శ్వనొప్పి తగ్గించడానికి దోహదపడుతుంది.
Eluka Jemudu: ఎలుక జముడు ఆకుల కషాయం తో క్యాన్సర్ కు చెక్..!!
ఎలుక జముడు ఆకులను సేకరించి శుభ్రపరుచుకోవాలి. ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో ఈ ఆకులను వేసి ఐదు మిరియాలను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీరు మరిగాక వడపోసుకోవాలి ఇలా తయారుచేసుకున్న ఈ కషాయాన్ని మూడు నెలల వ్యవధిలో 15 రోజులు తాగాలి. మరల మూడు నెలల తరువాత మరో 15 రోజులు తాగాలి. అంటే మూడు నెలల్లో 15 రోజులు మాత్రమే ఈ కషాయాన్ని తాగాలి. ఈ కషాయం తాగడం వలన జ్వరం, దగ్గు, జలుబు తగ్గుతుంది. ఈ కషాయం తాగడం వలన అనేక రకాల వైరల్ ఫీవర్ ను తగ్గిస్తుంది.
ఈ కషాయం తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి. క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. ఒకవేళ క్యాన్సర్ తో బాధపడుతుంటే ఈ కషాయం ఇప్పుడు చెప్పుకునే విధంగా తాగితే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.