అనుష్క శెట్టి .. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ సినిమాలో నటించిన అద్భుతంగా నటిస్తుంది ఈ భామ. అయితే ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా ఈరోజు మరో గంటలో రిలీజ్ అవ్వనుంది. ఫిబ్రవరి లోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మార్చిలో విడుదల అవుతుందని చెప్పగా ఆతర్వాత కరోనా వైరస్ రావడం..
కరోనా వైరస్ దారుణంగా వ్యాపించడం.. దాని వల్ల మార్చిలో విడుదల అవ్వాల్సిన సినిమా కాస్త లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ పడుతూ ఈరోజు విడుదల అవుతుంది. ఇంకా తీరా విడుదల అయ్యే గంట ముందు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
అది ఏంటి అంటే.. సినిమాలో అనుష్క ముగా అమ్మాయిగా నటిస్తుంది. ఈ సినిమాలో అనుష్క ఒక్క మాట కూడా మాట్లాడకుండా నటించింది అని ఇన్నాళ్లు వార్తలు వచ్చాయ్. కానీ ఇప్పుడు మాత్రం అనుష్క సినిమా చివరిలో కొన్ని నిమిషాలు మాట్లాడుతుందట. కరెక్ట్ గా గంట ముందు రిలీజ్ అయ్యే ముందు ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెరిగాయ్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!