Raashi Khanna Helping: భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది.. ఈ క్రమంలో సెలబ్రిటీలు ప్రజలను అప్రమత్తం చేస్తూ, వారికి తోచిన విధంగా సాయం చేస్తున్నారు.. అయితే కొందరు సెలబ్రిటీలు మాటలకు మాత్రమే పరిమితం కాగా.. మరికొందరు చేతల్లో చేసి చూపిస్తున్నారు.. చేతల్లో చేసి చూపిస్తున్న జాబితా లోకి ఇప్పుడు రాశి ఖన్నా చేరిపోయిందని చెప్పవచ్చు.. లాక్ డౌన్ సమయంలో అనేక మంది అనాధలు, భిక్షగాళ్ల ఆకలిదప్పులు తీర్చే పనుల్లో ఈమె బిజీగా ఉంది.. ముంబై రోడ్లపై ఆకలితో అలమటించే జనాలు ఎందరో.. వారికి కడుపు నిండా తిండి పెట్టడం మీద రాశి ఖన్నా దృష్టి పెట్టింది..!!
ఇందుకోసం ఆమె ఓ స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపారు.. వీరితో మరికొంత మంది సిని ప్రముఖులు కూడా కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ అన్నదానం కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకుంటారు కానీ.. రాశి ఖన్నా అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది.. ఇదే రీతిలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ముందుకు సాగితే ఎంతోమంది నిరుపేదల ఆకలి తీరుస్తుంది..
రాశి ఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. తుగ్లక్ దర్బార్, అరణ్మన్తె , మేధావి లాంటి తమిళ చిత్రాలతో పాటు.. మలయాళంలో బ్రహ్మం అనే చిత్రంలో నటిస్తుంది. తెలుగులో గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ చిత్రంలో నటిస్తోంది. ఫ్యామిలీ మాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న తాజా వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈ వెబ్ సిరీస్ లో రాశి హత్యలు చేసే హంతకి పాత్రలో నటిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!