బిగ్ బాస్ షోలో బాబా మాస్టర్ మంచి ఎంటర్టైనర్. షో కోసం అతడు చేసిన సందడిని ఎవరూ మర్చిపోలేరు. బుల్లితెర పై ఒక రేంజ్ లో తన సత్తా చాటిన భాస్కర్ తర్వాత బుల్లితెర లో ఏ షో లలో పెద్దగా కనిపించలేదు.
అయితే ‘ఈ టీవీ’ కి అతి భారీ టిఆర్పి తెచ్చిపెడుతున్న ‘ఢీ’ డాన్స్ షో లో శేఖర్ మాస్టర్ కు కరోనా సోకడం తో అతని స్థానంలో బాబా భాస్కర్ ఈ వారం జడ్జిగా సెట్ లోకి వచ్చాడు. ఈ సమయంలో ఈ వేదికపై బాబా ఎంట్రీ తోనే సెటైర్ల వర్షం కురిపించాడు. ఎంట్రీ డాన్స్ చేసి చేసి బాబా కిందపడగానే “వాటర్.. వాటర్” అంటూ యాంకర్ ప్రదీప్ అనడంతో “వద్దు నేను అంత ముసలివాడిని అవ్వలేదమ్మా” అంటూ అదిరిపోయే సెటైర్ వేశారు.
ఆ తర్వాత ఆది, వర్షిణి, రష్మి, సుధీర్…. కంటెస్టెంట్స్ అదిరిపోయే డాన్సులు వేస్తూ ఉంటే ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో బాబా వాళ్లంతా కష్టపడి పర్ఫామెన్స్ చేస్తుంటే సుధీర్ ని “కరోనా పేషెంట్ అలా కదలకుండా కూర్చున్నావ్ ఏంట్రా…. నీకు పైల్స్ ఏమైనా ఉన్నాయా?” అని కౌంటర్ వేశారు.
దాని తర్వాత సుధీర్ వేస్ట్…. రష్మీ డబుల్ వేస్ట్…. వర్షిణి టోటల్ వేస్ట్ అంటూ అందరి పరువు తీసేసాడు. ఇక ప్రోమో లోనే అతను ఇలా వారిని ఏడిపించేస్తే…. పూర్తి ఎపిసోడ్ లలో వారిని ఏ రేంజ్ లో ఆడుకొని ఉంటాడు అర్థం చేసుకోవచ్చు. చివర్లో అతను ‘ఢీ’ గురించి ఎమోషనల్ అయ్యాడు. ఇలాంటి డ్యాన్సులను చూసేందుకు జడ్జిలు డబ్బులు ఇచ్చి మరీ విచ్చేస్తారని షో నొ ఆకాశానికి ఎత్తేశాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!