భారతీయ సినీ చరిత్రలో తన పేరును సువర్ణక్షరాలతో లిఖించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి కుటుంబ నేపథ్యంలో లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరు.. తన దైన నటన, యాక్షన్, కామెడి, డాన్సులతో అదరగొడుతూ.. వెండితెర మెగాస్టార్గా ఎదిగారు. తన సినిమాలతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టి.. ఎనలేని ఆదరణతో.. అభిమానులను పొందగలిగారు. కొంత గ్యాప్ తీసుకుని ఇటీవలే “సైరా” అంటూ ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చి నట విశ్వరూపాన్ని చూపారు.
తాజాగా ఆయన “ఆచార్య” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదాపడుతూ వస్తోంది. కరోనా లాక్డౌన్కు సడలింపులు ఇవ్వడంతో తిరిగి షూటింగ్లు ప్రారంభమయ్యాయి. అయితే, మెగాస్టార్కు కరోనా సోకడంతో మరో సారి ఆచార్య షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ కోలుకోవడంతో.. ఎలాగైన త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాజీ పడకుండా పనిచేస్తున్నారట చిరు.
ఈ సినిమా దర్శకుడు కొరటాల సైతం.. ఆచార్య షూటింగ్ను త్వరగా పూర్తి చేయడానికి పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నరని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక సెట్లో జరుగుతోంది. కాగా, ఈ సినిమాలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చరణ్ జోడీగి ఎవరు నటించబోతున్నారనేది ఇప్పటికీ చిత్ర యూనిట్ వెల్లడించలేదు. కానీ అందాల తార రష్మిక నటిస్తున్నారనే వార్తలు ఆ మధ్యన హల్చల్ చేశాయి.
అయితే, తాజాగా అందిన సమాచారం ప్రకారం.. బాలీవుడ్ భామ చరణ్ తో రోమాన్స్ చేయబోతున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చరణ్ తో జతకట్టబోయే ఆ భామ ఎవరో కాదు.. కియారా అద్వానీ. ఆమెను ఈ ప్రాజెక్టులోకి తీసుకుంటే.. ఈ మూవీ హిందీ వెర్షన్కు కలిసివస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇదే గనక నిజమైతే.. రెండో సారి కియరా, చరణ్ల జోడీ వెండితెరపై రెచ్చిపోనుందని తెలుస్తోంది. ఈ జంట ఇదివరకే “వినయ విధేయ రామ” చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోసిస్తున్నారనీ, దాదాపు 40 నిమిషాల నిడివి ఉంటుందని సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!