Today Gold Rate: (12/5/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. ఈ రోజు బంగారం ధర పైపైకి కదిలాయి.. బంగారం ధరలు పెరుగుతూ ఉంటే.. నగలు కొనుక్కునే వారికి సమస్యలు, పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి సంతోషం ఉండడం సహజమే.. ఇప్పుడు అదే జరుగుతోంది.. పెళ్లిళ్ల సీజన్ రాగానే బంగారం ధరలు భగ్గుమంటున్నాయి.. వాస్తవానికి ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం రాగానే బంగారం ధరల్లో పెరుగుదల మొదలైంది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..
బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో ఈరోజు ధర రూ.48,770 కి చేరింది.. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర కి రూ.90 పెరిగింది. దీంతో ఈరోజు ధర రూ.44,700 కి చేరింది.. దేశంలో పెళ్లిళ్ల సీజన్, 27 రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ లు ఉండడంతో.. ఆర్థిక పరిస్థితులు దిగజారతయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు..
అలాంటి సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అడ్డంగా మునిగిపోతాం అని భావిస్తూ.. ఆ డబ్బులు బంగారంపై పెట్టుబడిగా పెడుతున్నారు.. అందువల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి.. అంతేకాదు డాలర్ విలువ కూడా పెరుగుతోంది. అందువల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది భారతదేశం. దీని వలన కూడా బంగారం ధర పెరుగుతోంది. ఈ పెరుగుదల రూ.50,000 దాటొచ్చని అంటున్నారు నిపుణులు. ఒకవైపు బంగారం ధరలు పెరుగుతూ ఉంటే.. మరోవైపు వెండి ధరలు దిగివచ్చాయి.. నిన్నటి వెండి ధర కి ఏకంగా రూ.500 తగ్గింది.. దీంతో ఈ రోజు కిలో వెండి ధర రూ.76,000 కు క్షీణించింది..