YS Jagan: రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకూ జన సునామీని చూశామని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వద్ద నిర్వహించిన సిద్దం సభలో ఆయన మాట్లాడారు. కరోనా కష్టకాలంలోనూ బటన్లు నొక్కడం ఆపలేదని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర మన ప్రభుత్వానిదని అన్నారు. రూ.2.70 లక్షల కోట్లు పేద ప్రజలకు పంచామని వివరించారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని అన్నారు.
మేనిఫెస్టో లో పేర్కొన్న 99 శాతం హామీలు నెరవేర్చామని అన్నారు. జగన్ కు ఓటేస్తేనే ప్రస్తుత పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటు వేస్తే అవి ఆగిపోతాయినట్లేనని తెలిపారు. మరో పద్దెనిమిది రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయని, మీ కుటుంబాల్లో మంచి జరిగి ఉంటేనే వైసీపీకి ఓటు వేయాలని కోరారు. అందరూ ఇంట్లో కూర్చుని ఆలోచించుకుని, మాట్లాడుకుని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని జగన్ సూచించారు.
చంద్రబాబుకు రోజూ నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని జగన్ అన్నారు. చంద్రబాబు లాంటి మోసగాడు కావాలా..? జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాలా..? అని ప్రజలను తేల్చుకోమన్నారు. ఇవి ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదని అన్నారు. పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం సభ అన్నారు. గత 58 నెలల్లో పేద ప్రజల్లో వెలుగులు నింపామని అన్నారు. చంద్రబాబు పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ.. దిగజారిపోయారని విమర్శించారు. మంచి పనులు చేశానని చంద్రబాబు చెప్పుకోలేడని అన్నారు.
ఇదే సందర్భంలో వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పారు. 2024 ఎన్నికలకూ తాను అలివి కాని వాగ్దానాలను ఇవ్వనని చెప్పారు. నన్ను నమ్ముకున్న ప్రజలను మోసం చేయనని కూడా జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో తాను పాల్గొనని అన్నారు. చంద్రబాబుకు వాగ్దానాలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేయరని అన్నారు. తాను మ్యానిఫెస్టో లో పెడితే ఖచ్చితంగా అమలు చేసేవే పెడతానని తెలిపారు. చంద్రబాబు మాదిరిగా మోసపు హామీలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో రైతు రుణ మాఫీ చేస్తానని చెప్పి చేశాడా అని ప్రశ్నించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?