డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందల సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లవ్ స్టోరీ సినిమాతో మొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది. నారయణ దాస్ నారంగ్, పి రామ్మోహన రావు నిర్మాతలు గా శేఖర్ కమ్ముల సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది.
ఫిదా లాంటి డీసెంట్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక మొదటి సారి సాయి పల్లవి, నాగ చైతన్య కలిసి నటించడం, లవ్ స్టోరీ అన్న టైటిల్..ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, రొమాంటిక్ టీజర్ కూడా యూత్ లో అంచనాలను పెంచాయి. శేఖర్ కమ్ముల సినిమా అంటే కేవలం యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది.
మజిలీ లాంటి సూపర్ హిట్ అందుకొని మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య ఈ సినిమాతో మరో భారీ సక్సస్ అందుకోవాలనుకున్నాడు. కాని కరోనాతో ఇంకా ఈ సినిమా చిత్రీకరణనే కంప్లీట్ కాలేదు. అయితే ఈ సినిమా ఆగష్టు ఫస్ట్ వీక్ నుండి సెట్స్ మీదకి వెళుతుందని అంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో లవ్ స్టోరీ లోని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరిపేందుకు మేకర్స్ ను ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా ఇప్పట్లో థియోటర్స్ ఓపెన్ కాని నేపథ్యంలో శేఖర్ కమ్ముల ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేక థియోటర్స్ ఓపెన్ అయ్యో వరకు వేయిట్ చేస్తారా అన్నది తెలియడం లేదు. ఇప్పటికే జనాలు ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ లోపు రాం గోపాల్ వర్మ ఏటీటీ అంటూ మొదలు పెట్టారు. మరి శేఖర్ కమ్ముల థియోటర్స్ ఓపెన్ అయ్యో వరకు సినిమాని రిలీజ్ చేయను అంటే మాత్రం కొంతమందికి షాకే.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!