దేశం మొత్తాన్ని కాషాయం తో నింపేయాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఏ అవకాశాన్నీ వదలడంలేదు. వరుసపెట్టి రాష్ట్రాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటూ గోవా నుండి మొదలు పెట్టి కర్ణాటక వరకు ఇప్పటి వరకు జైత్రయాత్ర కొనసాగిస్తూనే ఉంది. ఇక ఎన్నికలలో అధికారంలోకి రాకుంటే ఓర్పుతో వెయిట్ చేసి మరి ఆ రాష్ట్రాన్ని వశం చేసుకోవడం బిజెపి నేతలకు వెన్నతో పెట్టిన విద్య గా మారింది. కర్ణాటక తర్వాత తాజాగా మధ్యప్రదేశ్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది.
ప్రస్తుతం అటు వైపే వారి కన్ను
కర్ణాటకలో తిరిగి అధికారాన్ని చేపట్టడానికి బిజెపికి 14 నెలల సమయం పట్టింది. ఇక దానికి కొంచెం అటు ఇటుగా మధ్యప్రదేశ్ లోనూ జెండా ఎగురవేసింది. ఇప్పుడు గులాబీ పార్టీ తన చూపును రాజస్థాన్ వైపుకు తిప్పింది. బలం ఉన్న నేతలను తనవైపు తిప్పుకొని అధికారాన్ని దక్కించుకునే బిజెపి రాజస్థాన్ లో కూడా పాగా వేసేందుకు పెద్ద వ్యూహం రచించింది. దానికి పర్యవసానాలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇక బిజెపి రాజస్థాన్ లో కూడా జెండా ఎగరవేయడం ఖాయమని చెబుతున్నారు.
ఆ తర్వాత పెద్ద రాష్ట్రానికే టెండర్
నిజానికి బిజెపి ప్రభుత్వమే మహారాష్ట్రలో ఏర్పడవలసి ఉంది. అయితే బిజెపి శివసేన కలిసి పోటీ చేసి అత్యధిక స్థానాలను గెలుచుకున్నప్పటికీ సీఎం పదవి విషయంలో మధ్య భేదాలు వచ్చి దశాబ్దాల బంధానికి బీటలు వారింది. ఇక మామూలు రాష్ట్రాలనే బిజెపి వదిలిపెట్టదు అలాంటిది తమకు దక్కవలసిన రాష్ట్రాన్ని చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తుంది..? ఇంతలోపల కాచుకుని కూర్చున్న కాంగ్రెస్ శివసేన, ఎన్సీపీల తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఆ కూటమిని దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఇప్పుడు వేగంగా అడుగులు వేస్తోంది.
శభాష్ అనాలా…. భయపడాలా..?
ఇప్పుడు ఇందులో భాగంగా కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే కూడా శరద్ పవార్ ను ఎన్డీఏ లోకి రావాలని సూచించారు. గత కొద్ది రోజులుగా శరద్ పవార్, ముఖ్యమంత్రి మధ్య పొసగడం లేదు. ఇక బిజెపి ఇలా వారిని టార్గెట్ చేస్తూ జెండా ఎగురవేసేందుకు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. వారి ప్లానులు, పనితనం చూసి పొగడాలో ఇకపోతే దేశంలో రాజకీయాలు ఇంత అన్యాయంగా ఉన్నాయని బాధపడాలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక రాజకీయ నాయకులు వారి పనులు ఇలాగే ఉంటాయని.. ఎవరి జీవితం వారి చూసుకుని ముందుకు వెళ్దాం అంటే చివరికి అది తిరిగి తిరిగి బ్రతుకులపై ఎఫెక్ట్ పడుతుంది అన్న భయం కూడా మరొకవైపు ఉంది. ఇకపోతే బిజెపి ఊపు చూస్తుంటే వారు మహారాష్ట్ర ను కూడా కైవసం చేసుకోవచ్చు.