తల్లిపాలు బిడ్డలకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి . నవజాత శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానమని పొత్తిళ్లలోని పసిబిడ్డకు అమ్మ పాలే ఆరోగ్యం అంటారు. కానీ, తల్లులందరికీ పాలిచ్చే శక్తి, అవకాశం ఉండకపోవచ్చు. అలాంటివాళ్ల బిడ్డలకు అండగా నిలుస్తోంది ఈ పాల బ్యాంక్.
తల్లి వద్ద సమృద్ధిగా పాలు ఉన్నప్పటికీ..శిశువు అనారోగ్యంతో బాధపడుతుండటంతో తాత్కాలికంగా ఫీడింగ్ నిలిపి వేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారంతా స్వచ్ఛందంగా తల్లిపాల నిధికి చేరుకుని తమ పాలను దానం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వీరు రొమ్ము కేన్సర్ బారి నుంచి బయటపడే అవకాశం ఉంది.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తోంది. ఎప్పుడు, ఎక్కడ ఎలా ఎటు నుంచి ఈ వైరస్ ఎటాక్ చేస్తుందో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో ప్రజలు ఏది చేయాలన్నా భయపడిపోతున్నారు. బయట నుంచి వచ్చే పాలు ఆహార పదార్థాల నుంచి కూడా కరోనా సోకుతుందంటూ అందరూ భయపడుతున్నారు.
అయితే… పాశ్చరైజేషన్ చేసిన తల్లిపాలలో కొవిడ్-19 క్రియాశీలకంగా ఉండే అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు …గుర్తించారు. ఈ పాలను తల్లిపాలకు దూరమైన శిశువులకు ‘తల్లిపాల బ్యాంకు’ల ద్వారా ఇస్తారు..తల్లిపాలను దానం చేసే మహిళల నుంచి వాటిని సేకరించింది నిల్వ చేస్తారు.ఈ క్రమంలో కరోనా సోకిన మహిళలు దానం చేసిన పాలను కూడా 62.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాల…పాటు పాశ్చరైజ్ చేసి, కొవిడ్-19ను క్రియాశీలకంగా ఉండకుండా చేయొచ్చని కెనడా శాస్త్రవేత్తలు గుర్తించార. ఈ పాలను శిశువులకు ఇవ్వడం సురక్షితమేనని కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో పేర్కొన్నారు. కాగా, …తల్లికి కరోనా సోకితే శిశువుకు స్వయంగా పాలు ఇవ్వచ్చని ఇప్పటికే శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.