ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మరియు మాజీ ఎండోమెంట్ మినిస్టర్ పైడి కొండల మాణిక్యాలరావు కరోనా వైరస్ సోకి బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే 58 ఏళ్ల వయసున్న మాణిక్యాల రావు పరిస్థితి ఇప్పుడు విషమంగా మారింది.
గత కొద్ది వారాలుగా కోవిడ్ సోకి తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్న మాణిక్యాలరావు పరిస్థితిని అదుపు చేయడం వైద్యులకు కష్టం గా ఉందట. ఇక ఇప్పటికే అతనికి కలేయానికి ఈ వైరస్ వ్యాపించగా అతని బాడీ లోని ముఖ్యమైన అవయవాలకు కూడా వైరస్ ముప్పు పొంచి ఉంది అని చెబుతున్నారు. దీనితో అతని రోగ నిరోధక శక్తి క్రమంగా క్షీణించడం మొదలైంది.
ఇక అతని కుటుంబ సభ్యులు మరియు బిజెపి పార్టీ అభిమానులు ఆందోళన లో ఉండగా అతని పరిస్థితిని కుదుటపరిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని వైద్యుల తెలపడం జరిగింది.