గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రజలలో ఇండియా పై ఉన్న కొద్ది ప్రేమ పెరుగుతుంది. ఇండియా దేశం లో ఉంటేనే భవిష్యత్తులో అభివృద్ధి చెందు తామని… పాకిస్తాన్ ఆక్రమణకు గురైన ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు. పాకిస్థాన్ లో ఉండలేమని ఇండియాలో కలిపేయాలని ప్రాధేయపడుతున్నారు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ఈ భూభాగానికి చెందిన రాజకీయ ఉద్యమకారుడు సెంగే హెచ్ సేరింగ్ ఈ విషయాన్ని మరింతగా ప్రపంచం మొత్తం తెలిసేలా చెప్పారు. సెంగే హెచ్ సేరింగ్ గిల్గిట్-బాల్టిస్థాన్ స్టడీస్ డైరెక్టర్ గా వాషింగ్టన్ లో పనిచేస్తున్నారు.
ఆయన ఇటీవల మాట్లాడుతూ తాము భారత ప్రభుత్వం ఆధీనంలో ఉండే జమ్మూ కాశ్మీర్ లో భాగమని, 1947 లో మహారాజ హరిసింగ్ తమ చట్టబద్ధ వారసుడిని చెప్పుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ మహారాజ హరిసింగ్ పరిపాలించిన ప్రాంతం అని…, మధ్యలో బ్రిటిష్ వారు రావడం వల్ల మేము అన్యాయం అయిపోయాము. 2019వ సంవత్సరం ఆగస్టు 5న 370 ఆర్టికల్ రద్దు చేసే వరకు తాము జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన చెందినవారమని, ప్రస్తుతం లడక్ కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతానికి చెందిన వారం అవుతాం అని చెప్పుకొచ్చారు.
అటువంటి మా ప్రాంతంపై పాకిస్తాన్ దేశం దురాక్రమణకు పాల్పడుతోందని, వెంటనే ఇండియా కలుగజేసుకుని తమ ఆధీనం లోకి తీసుకోవాలని, గిల్గిట్-బాల్టిస్థాన్ భూభాగానికి చెందిన రాజకీయ ఉద్యమకారుడు సెంగే హెచ్ సేరింగ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలోని శాశ్వత సభ్య దేశాలు కూడా గిల్గిట్-బాల్టిస్థాన్ గురించి అర్థం చేసుకున్నాయని, ఇది పాకిస్థాన్లో భాగం కాదని తెలుసుకున్నాయని ఇండియా ఈ విషయంలో కలుగజేసుకుని న్యాయం తీర్చాలని, ఆదుకోవాలని కోరారు.