మణికర్ణిక సినిమా క్రెడిట్ విషయంలో దర్శకుడు క్రిష్, కంగనా సిస్టర్ రంగోళి మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. 80%తాను పూర్తి చేసిన సినిమాని కంగనా చెడగొట్టిందని క్రిష్ అంటుంటే, క్రిష్ చేసిందేమి లేదు మణికర్ణిక సినిమా భారాన్నంతా కంగనానే మోసిందంటూ రంగోళి అంటోంది. పరస్పర విమర్శలతో తారాస్థాయికి చేరిన ఈ వివాదం, చాట్ హిస్టరీలు బయట పెట్టుకునే వరకూ వెళ్లింది.
ముందుగా ఈ మణికర్ణిక వివాదానికి ఆజ్యం పోసిన రంగోలి, కంగనా క్రిష్ కి పంపిన వాట్సాప్ మెసేజ్స్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అందులో క్రిష్ ని కంగనా డిసెంబర్ 6న స్క్రీనింగ్ కోసం రమ్మని ఆహ్వానించినట్టు, దాని కన్నా ముందు నిర్మాతలైన జీ స్టూడియోస్, కమల్ జైన్ లతో జరిగిన వ్యవహారాలు వివరించినట్టు మెసేజులు అందులో ఉన్నాయి. 20 కోట్లకు పైగా అదనపు పెట్టుబడి పెట్టి రీ షూట్ చేసేందుకు నిర్మాతలు ఒత్తిడి చేసారని స్క్రిప్ట్ లో మార్పులు కూడా రచయితలు చేసినవి తప్ప తనవి కావని కంగనా, క్రిష్ కి చెప్తున్నట్లు ఉన్నాయి. కంగనా చేసిన మెసేజెస్ వరకూ బాగానే ఉన్నాయి కానీ వాటిని చూసి క్రిష్ ఎలా స్పందించాడనే రిప్లై మాత్రం రంగోళి పోస్ట్ చేయలేదు.
ట్విట్టర్ లో రంగోళి పోస్ట్ చేసిన ఫోటోలు చూసిన తర్వాత స్పందించిన క్రిష్, తనతో పాటు సినిమాకి వర్క్ చేసిన వారితో జరిగిన చర్చని, మణికర్ణిక సినిమాకి కంగనా చేసిన అన్యాయాన్ని బయట పెట్టాడు. ఎవరికి వారూ క్రెడిట్ కోసం కష్టపడుతూ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ చేస్తున్నారు. మరి ట్విట్టర్ వేదికగా క్రిష్, రంగోళి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఎక్కడి వరకూ వెళ్లి ఆగుతుంది? ఎవరిది తప్పని తేలుస్తుంది అనేది చూడాలి.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!