NewsOrbit
రాజ‌కీయాలు

రెబెల్ ఎంపీ ఢిల్లీ రాజకీయం..! సొంత జిల్లాకు రారేమిటీ..??

mp raghu rama krishna raju still in delhi

రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం సహజం. కానీ.. ఓ నాయకుడు తాను గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అదే పార్టీలో రెబల్ గా మారడం అత్యంత అరుదుగా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది. సాక్షాత్తూ ఏపీ సీఎం జగన్ ఈ తిరుగుబాటు రాజకీయాన్ని ఎదుర్కొంటున్నారు. నరసాపురం నుంచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణ రాజు నిత్యం సీఎం జగన్ పై, ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. నియోజకవర్గానికి రాకుండా ఢిల్లీలోనే ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న విమర్శల నేపథ్యంలో.. తాను నియోజకవర్గానికి రాలేనని భయం వేస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు కూడా.

mp raghu rama krishna raju still in delhi
mp raghu rama krishna raju still in delhi

ఎంపీ భద్రతతో వస్తారని వైసీపీ శ్రేణుల ఎదురుచూపులు..

ఈనేపథ్యంలో వైసీపీ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేలను కేంద్రంలోని పెద్దలకు బూచిగా చూపించారు. నరసాపురం వెళ్తే తనపై దాడులు జరిగే అవకాశం ఉందని ఏకంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు చెప్పుకున్నారు. తనకు అదనపు భద్రత ఇవ్వాలని కోరారు. ఆయన విన్నపం మేరకు కేంద్రం రఘురామకృష్ణ రాజుకు వై కేటగిరీ భద్రత కల్పించింది. దీంతో ఆయనకు ఉండే భద్రతకు అదనంగా 13 మందితో అదనపు భద్రత కల్పించింది కేంద్రం. రాష్ట్రంలో సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు మాత్రమే ఆస్థాయి భద్రత ఉంది. మరి.. ఇంతటి భద్రత తీసుకుని కూడా ఆయన నరసాపురం ఎందుకు రావడం లేదనేది స్థానిక వైసీపీ నాయకుల ప్రశ్న. కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం కానీ.. నియోజకవర్గంలో పర్యటించడం కానీ చేయకపోగా పార్టీలో ఉంటూనే ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని వైసీపీ నాయకులు రఘురామకృష్ణ రాజుపై ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. ఎంపీకి తన నియోజకవర్గంపై, ప్రజలపై బాధ్యత లేదనడానికి ఇదే నిదర్శనమని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నరసాపురం రాకుండా ఢిల్లీలో కూర్చుని ఆయన చేస్తున్న రాజకీయం కూడా దీనినే బలపరుస్తోంది.

భద్రత ఇచ్చి బీజేపీ తప్పు చేసిందా..

రఘురామకృష్ణ రాజు తీరుపై ఇప్పుడు బీజేపీలో కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎంపీ మాటలు విని కేంద్రం భద్రత కల్పించింది. కానీ.. ఆయన ఢిల్లీని ఎందుకు వీడటం లేదో.. ఏ భయం చూపించి భద్రత తీసుకున్నారో అదే భద్రతతో నరసాపురం వెళ్లాలి కదా అనే ప్రశ్నలు కేంద్రం పెద్దల్లో కూడా వ్యక్తమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో ఉంటూ వైసీపీకి వ్యతిరేకంగా.. టీడీపీకి అనుకూలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ నాయకత్వం సైతం మండిపడుతోంది. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఏకంగా బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు. ఏపీ రాజధాని విషయం ఆ రాష్ట్రం ఇష్టం అంటూ కేంద్రం ఇటివలే హైకోర్టుకు రాతపూర్వకంగా తెలిపింది కూడా. అయినా.. కేంద్రంపై ఎంపీ వ్యాఖ్యలు చేయడాన్ని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. మాకు సలహాలు ఇచ్చేకంటే మీ పరిస్థితి గురించి ఆలోచించుకోండి అంటూ కౌంటర్ కూడా వేశారు.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?