(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)
ఇతర రాష్ట్రాల నుంచి ప్రాంతాలనుంచి మద్యం మద్యం తీసుకువచ్చే విషయంలో హైకోర్టు బుధవారం ఓ కీలక ఆదేశం ఇచ్చింది… ఎక్సైజ్ పాలసీ లో చెప్పినట్లుగానే ఇతర రాష్ట్రాల నుంచి మూడు లీటర్ల మేర మద్యాన్ని ఒక మనిషి తీసుకురావచ్చని స్పష్టం చేసింది.. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు మూడు బాటిల్ వరకు మద్యం తీసుకొచ్చే వెసులుబాటు దీని ద్వారా వస్తుంది.
ఇలా మొదలైంది ???..
మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని ఎన్నికల హామీలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దిశలో భాగంగా మొదటి అడుగు గా మద్యం షాపులన్నీ ప్రవేట్ వారి దగ్గర్నుంచి తీసుకొని ప్రభుత్వ మద్యం దుకాణాలు గా మార్చారు… దీనివల్ల ధరల హెచ్చుతగ్గులు నకిలీ మద్యం అరికట్టవచ్చని భావించారు.. ప్రభుత్వ ఆదాయం సైతం దీని వల్ల భారీగా పెరుగుతుందని భావించారు.. రాష్ట్రంలో ఉన్న సుమారు 3500 వైన్ షాపుల ను రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంది… దీనికోసం సూపర్వైజర్లు సేల్స్ మెన్ లను నియమించుకున్నారు.. మూడు నెలలు ఈ ప్రక్రియ మొదలు కాగానే వైన్ షాపుల్లో సుమారు 30 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కరుణ విపత్తు తర్వాత సుమారు 70 శాతం మద్యం ధరలు పెంచారు.. కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఒడిశా ప్రాంతాల్లో మద్యం ధరలు తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి భారీగా అక్రమ రవాణా మొదలైంది.
ఒక మాఫియా తరహాలో…
మద్యం అక్రమ రవాణా ప్రస్తుతం ఒక మాఫియా మాదిరిగా రాష్ట్రంలో తయారయింది.. రాష్ట్ర సరిహద్దులకు పక్కనే ఉన్న నియోజకవర్గాల్లో కొందరు ప్రజాప్రతినిధులు తమ అనుచరులతో ఈ అక్రమ మద్యం రవాణా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ముఖ్యంగా తెలంగాణ.. ప్రాంతం నుంచి ఆంధ్ర సరిహద్దు.. కర్ణాటక రాష్ట్రం నుంచి రాయలసీమ సరిహద్దు.. తమిళనాడు రాష్ట్రం నుంచి నెల్లూరు చిత్తూరు సరిహద్దు.. ఒడిషా నుంచి శ్రీకాకుళం సరిహద్దు చాలా దగ్గరలో ఉండడంతో ఆయా ప్రాంతాల్లో మాఫియా అధికంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి… ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మద్యం తీసుకొస్తూ రాష్ట్రంలోని కొన్ని గోదాములు వాటిని నిల్వ చేస్తుంది తర్వాత ఇతర జిల్లాలకు వాటిని పంపిస్తున్నారని తద్వారా భారీగా అక్రమార్జన పాల్పడుతున్నారని ఇటీవల ఇంటిలిజెన్సు ముఖ్యమంత్రికి నివేదించింది… ప్రత్యేక పోలీసు అధికారులు జిల్లాకి ఒకరు నియమించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేశారు… ఎక్సైజ్ శాఖ దీంట్లో మిళితం చేయడం ఇప్పుడు అసలుకే మోసం వచ్చే పరిస్థితుల్లో ఏర్పడింది… స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో లోని పోలీసులు ఎక్సైజ్ అధికారులు కలిసి చేస్తున్న తనిఖీల్లో కేవలం వంద లో ఒక శాతం మాత్రమే పట్టుబడుతోంది అది కూడా ఇలాంటి రాజకీయ ప్రాబల్యం లేని కొందరు డబ్బు కోసం ఆశపడి అక్రమ మద్యం రవాణా చేస్తూ దొరుకుతున్న సందర్భాలే కనిపిస్తున్నాయి.. పెద్ద చేపలు ఎక్కడ పట్టుబడడం లేదన్నది అధికార పార్టీ నేతలు చెబుతున్న మాట.
తీర్పును గౌరవించాలి
రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మద్యం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాల్సిందే.. అయితే ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న నూ మరింత బలోపేతం చేయాలి.. ఒకపక్క ఇసుక మాఫియా తగ్గినా మద్యం మాఫియా ఎక్కువవుతోంది… దీన్ని కొల్లగొట్టాలని అంటే ముందు పెద్ద చేపలు మీదే దృష్టి పెట్టాలి… చిన్న చిన్న కేసులు అరకొర మద్యం బాటిల్ తీసుకువచ్చే కేసుల మీద ప్రతాపం చూపకుండా పెద్దపెద్ద గోదాములు… రాజకీయ నాయకులతో ప్రమేయం ఉన్న గోదాముల పై దాడులు నిర్వహిస్తే ముఖ్యమంత్రి.. డీజీపీ స్థాయి నుంచి కూడా మద్దతు లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి… ఇప్పటికే మద్యం అక్రమ రవాణా పుణ్యమా అని రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం గణనీయంగా పడిపోయింది ఇది ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పైన ప్రభావం చూపుతుంది.. ఇప్పుడు ఈ తీర్పు వల్ల పెద్దగా వచ్చే ఇబ్బంది లేకుండా మద్యం బాబులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు… అయితే క్షేత్ర స్థాయిలో మూడు బాటిల్ తెచ్చుకుంటూ పోలీసులకు పట్టుబడిన మరో మూడు ముళ్ళు వేసి వారు కేసు పెడతారు అనడంలో సందేహం లేదు కాబట్టి దీనిపై ఎక్కువ ఉత్సాహం పడకుండా అక్రమ మద్యం రవాణా అనే ఈ విషయాన్ని మందుబాబులు మర్చి పోవడమే ఉత్తమం…