NewsOrbit
న్యూస్

వైయస్ జగన్ టోటల్ రాంగ్ స్ట్రాటజీ ! అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నావు గురూ!

బీసీలపై అతి నమ్మకం పెట్టుకుని ఓసీలను దూరం చేసుకుంటున్న వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ రాజకీయ రాజకీయ వ్యూహం భవిష్యత్తులో వికటించగలదని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

ys jagan wrong strategy
ys jagan wrong strategy

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కి 151 సీట్లు వచ్చాయి అంటే అన్ని వర్గాలు ఆ పార్టీని ఆదరించాయని అర్థం.ఇందులో బీసీలు కూడా ఉండొచ్చు కానీ వారి వల్లనే వైసిపి ఇంత ఘనవిజయం సాధించిందని భావించడం కరెక్టు కాదని వారంటున్నారు.కానీ ఎందుకనో ముఖ్యమంత్రి జగన్ బిసిల జపం ప్రారంభించారు.వారికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు.రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలను బీసీలైన పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణలకు ఆయన ఇచ్చారు.వారి స్థానాల్లో బీసీలనే మంత్రులుగా కూడా తీసుకున్నారు.

కానీ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి విశ్లేషిస్తే ఔనన్నా కాదన్నా బీసీలు టిడిపికి కంచుకోట.మొన్నటి ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో జగన్ ఇచ్చిన ఒక్క ఛాన్స్ నినాదంతో వారు కూడా ఆయన వైపు మొగ్గు చూపారు తప్ప పూర్తిగా వైసీపీ వైపు తిరిగి పోలేదు.కానీ జగన్ మాత్రం బీసీలంతా వైసీపీలోకి వచ్చేశారు అన్న భ్రమలో ఉన్నారంటున్నారు.జగన్ ప్రభుత్వం పదవులు ఇవ్వాలంటే బీసీలే కొలమానంగా పెట్టుకుంటోంది. జగన్ లెక్కలు వేరు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కలుపుకుంటే బాహుబలిగా వైసీపీ మారుతుందని అంచనా వేస్తున్నారట .నిజానికి కాంగ్రెస్ పార్టీకి అగ్రకులాలు, ప్రత్యేకించి రెడ్లు పూర్తి అండగా నిలబడతారు.

గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెడ్లకు టాప్ ప్రియారిటీ ఇచ్చేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తిరగబడింది. జగన్ రెడ్ల ని దగ్గరకు రానివ్వడం లేదని ఆ సామాజిక వర్గంలో అసమ్మతి రగులుతోంది.బీసీలను అంతగా నమ్మటం మంచిది కాదని వైసిపి వర్గాలు గొనుకుంటున్నాయి.బీసీల ఓటు బ్యాంక్ ఎపుడూ టీడీపీకి పెట్టని కోటే. ఒకే ఒక ఎన్నిక అదీ 2019లోనే వైసీపీ వైపుగా ర్యాలీ అయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. బాబు ఆ అయిదేళ్లూ కాపులను బీసీల్లో చేరుస్తామని లేనిపోని హామీలు గుప్పించి వారి జపం చేశారు. బీసీలు ఎటూ తమవైపే కదా అని కడు ధీమా ప్రదర్శించారు. దాంతోనే వారంతా బాబుని వదిలి వైసీపీ వైపు చూశారు. అలా టీడీపీ పెట్టాక తొలిసారి వారు పసుపు పార్టీకి దెబ్బకొట్టారు. 2024 ఎన్నికలకు ఆ పరిస్థితి ఉంటుందా? అంటే చెప్పలేమనే అంటున్నారు.

బీసీలు గుత్తమొత్తంగా వైసీపీకి ఓటు వేసే సీన్ ఉండకపోవచ్చు. మరి వారినే నమ్ముకుని ఓసీలను, తనను వైఎస్సార్ ని దశాబ్దాల తరబడి అట్టిపెట్టుకుని ఉన్న రెడ్లను, ఇతర అగ్ర కులాలను జగన్ కనుక దూరం చేసుకుంటే రాజకీయంగా గట్టి షాకులు తగులుతాయి అన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే జగన్ తో ఉన్న సమస్యేమిటంటే ఆయన అనుకున్నది చేస్తారు తప్ప అందరి అభిప్రాయాలు తీసుకోరు.కాని సుదీర్ఘకాలం అధికారం లో ఉండాలంటే జగన్ బిసిలనే కాకుండా అన్ని వర్గాలను కూడా అక్కున చేర్చుకోవడం ఎంతైనా అవసరమని రాజకీయ పరిశీలకులు సలహా ఇస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju