దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దాదాపు 50 లక్షలకు దగ్గరలో పాజిటివ్ కేసుల సంఖ్య ఉంది. రోజుకి 90 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో కేంద్రంలోనూ మరియు వైద్యుల లో టెన్షన్ నెలకొంది. రికవరీ రేటు పరంగా చూసుకుంటే అంతా బాగానే ఉన్నా గానీ… వైరస్ వ్యాప్తిని అరికట్టడం అసంభవంగా మారింది. పరిస్థితి ఇలా ఉండగా లాక్ డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత పాక్షికంగా సేవలు అందిస్తున్న రైల్వే శాఖలోనూ కరోనా ప్రకంపనాలు రేపుతుంది.
తాజాగా తెలంగాణలోని సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఉండే రైల్ నిలయం లో మహమ్మారి పంజా విసిరింది. దాదాపు 40 మంది ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. పరిస్థితి చేయి దాటి పోయే రీతిలో ఉండటంతో అప్రమత్తమైన అధికారులు రైలు నిలయం రెండు రోజులపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రోటోకాల్ ప్రకారం శానిటేషన్, తదితర కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. దీంతో ప్రతీ ఫ్లోర్ లో బ్లీచింగ్ తో శుభ్రపరిచే కార్యక్రమాలు చేస్తున్నారు.
దీంతో రెండు రోజులపాటు రైలు నిలయం కార్యాలయం క్లోజ్ చేయబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా బారిన పడకుండా ఉన్న మిగతా ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఆన్ లైన్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలని పై స్థాయి అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దాదాపు 40 నుంచి 50 మందికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో మిగతా వారిలో టెన్షన్ మొదలైనట్లు, వాళ్లంతా ఇంటిలోని అబ్జర్వేషన్లో ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి.