ప్రభాస్ కెరీర్ని మలుపు తిప్పిన మూవీ వర్షం. ఈ సినిమాకు రీమేక్గా బాలీవుడ్లో బాఘి మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీకు సీక్వెల్గా బాఘీ2ని తెరకెక్కించారు. అహ్మద్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది మార్చిలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే బాఘీ2 రిజల్ట్తో సంబంధం లేకుండానే ఇప్పుడు బాఘీ 3 ప్లాన్ చేస్తున్నారు చిత్రటీమ్.
అయితే బాఘీ సిరీస్లో వచ్చిన రెండో పార్ట్ తెలుగు సినిమా క్షణంకి రీమేక్గా తెరకెక్కగా, మూడో పార్ట్ ఏ చిత్రాన్నితీసుకోని రీమేక్ చేస్తారో ఆని ఆసక్తి నెలికొంది. ఇక మూడో సీక్వెల్లో కూడా హీరోగా టైగర్ ష్రాఫ్ నటించబోతున్నాడు. అయితే హీరోయిన్గా బాఘీ మొదటి పార్ట్లో టైగర్ సరసన నటించిన శ్రద్ధా కపూర్నే మూడో పార్ట్లో తీసుకోబోతున్నారని బిటౌన్ వర్గాల సమాచారం. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియావాలా ఈ చిత్రాన్న నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020 మార్చి 6న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మూడో సీక్వెల్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!