NewsOrbit
న్యూస్

‘తోట’కు నిప్పెట్టే పనిలో సుభాష్ చంద్రబోస్!ఆ లేఖ ఆంతర్యమిదేనా?

East Godavari YSRCP: Big Scams in Big District being Big Issues in YSRCP

రామచంద్రాపురం శిరోముండనం కేసును వైసిపి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తిరగదోడడంతో అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇబ్బంది పడే సూచనలు గోచరిస్తున్నాయి.

ఇరవై సంవత్సరాల క్రితం తోట త్రిమూర్తులు ప్రమేయంతో ఒక దళితులకు శిరోముండనం జరిగిందన్న కేసు పెండింగ్లో ఉంది.అయితే అది ఇప్పటి వరకు విచారణకు నోచుకోలేదు.ఎప్పటికప్పుడు త్రిమూర్తులు అధికార పార్టీ పంచన చేరుతూ ఈ కేసును తొక్కిపెడుతున్నారని విమర్శలైతే ఉన్నాయి.తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏపీ హోంమంత్రి సుచరితకు ఈ కేసు విషయమై లేఖ రాశారు. దళితుల శిరోముండనం కేసు విచారణ వేగవంతం చేయాలని పిల్లి సుభాష్‌ ఆ లేఖలో కోరారు. దళితుల శిరోముండనం కేసులోఏ1గా తోట త్రిమూర్తులు ఉన్నారని, 20 ఏళ్లుగా కేసు తేలకుండా పలుకుబడితో విచారణకు రాకుండా వాయిదా వేయించుకుంటున్నారని, పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

దళిత సామాజికవర్గానికి చెందిన బాధితులు త్రిమూర్తులుతో పోరాడే స్థాయి లేని వారని సుభాష్ చంద్రబోస్ తన లేఖలో పేర్కొన్నారు వెంటనే బాధితులకు న్యాయం చేయాలని ఆయన హోం మంత్రిని కోరారు.ప్రస్తుతం ఈ వ్యవహారం వైసిపి లో హాట్ టాపిక్ అయ్యింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంది. 2004…2009 ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామచంద్రపురంలో త్రిమూర్తులను ఓడించారు.2014 ఎన్నికల్లో తోట త్రిమూర్తులు టిడిపి పక్షాన పోటీచేసి తన చిరకాల ప్రత్యర్థి,వైసిపి అభ్యర్థి సుభాష్చంద్రబోసు పై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ మండపేటకు వెళ్లిపోయారు. తోట త్రిమూర్తులు రామచంద్రాపురంలోనే టిడిపి అభ్యర్థిగా పోటీకి దిగి ప్రస్తుత మంత్రి వేణుగోపాల్ చేతిలో ఓటమి పాలయ్యారు.

మండపేటలో సుభాష్ చంద్రబోస్ ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆయనకు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తించి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇచ్చారు. ఇటీవలే ఆయనను రాజ్యసభకు కూడా పంపారు.అయితే ఈ మధ్యే తోట త్రిమూర్తులు కూడా వైసీపీ పంచన చేరారు.కాపు కుల సమీకరణాల నేపధ్యంలో జగన్ ఆయన్ను పార్టీలోకి రానిచ్చారు. పైగా మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి పదవి కూడా ఇచ్చారు.కానీ ఇది సుభాష్చంద్రబోస్కు కు నచ్చినట్టు లేదు. త్రిమూర్తులు పార్టీలో చేరినప్పుడు సుభాష్ చంద్రబోస్ వ్యతిరేకంచినట్లు కనిపించకుండానే తెరవెనక రాజకీయం చేసి ఇప్పుడు మళ్లీ ఆయన మీద ఉన్న శిరోముండనం కేసునుతెరపైకి తెచ్చారు.దీనిపై సీఎం ,హోంమంత్రుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి!

 

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju