టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన్న స్టార్ హీరోయిన్. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం లోనే సరిలేరు నీకేవ్వరు.. భీష్మ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకొని టాప్ ప్లేస్ కి చేరుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా ఉంది. ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ విషయంలో రష్మిక లక్కీ అని చెప్పాలి. పుష్ప గనక బ్లాక్ బస్టర్ అయితే దాదాపు మిగతా నాలుగు భాషల్లో కూడా హిట్ దక్కుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో రష్మిక కి అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి.
అయితే రష్మిక అందరిలా బాలీవుడ్ మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదా అని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారట. కారణం రష్మిక తో పాటు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే వరసగా బాలీవుడ్ లో భారీ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్ తో హౌజ్ ఫుల్ 4 తో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాతే సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ సినిమాలలో నటిస్తోంది. ఇక కాస్త గ్యాప్ తర్వాత రకుల్ కూడా టాలీవుడ్ లో మళ్ళీ ఫాం లోకి వచ్చింది. వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటోంది.
అంతేకాదు బాలీవుడ్ లో కూడా మూడు భారీ సినిమాలు చేస్తోంది. చెప్పాలంటే రకుల్ బాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శాలినీ పాండే కూడా బాలీవుడ్ లో మూడు సినిమాలకి సైన్ చేసింది. అంతేకాదు కీర్తి సురేష్ కి బాలీవుడ్ లో సినిమా అవకాశం వచ్చింది. కానీ తెలుగు, తమిళ సినిమాలలో బిజీగా ఉండటంతో హిందీ ప్రాజెక్ట్ వదిలేసిందని అంటున్నారు.
ఇలా అందరు సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ లో వరసగా అవకాశాలు అందుకుంటున్నారు. టాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్స్ అందుకుంటున్నారు. కాని రష్మిక ఇప్పటి వరకు ఒక్క బాలీవుడ్ సినిమా కూడా అవకాశం రాలేదు. టాలీవుడ్ లో కాంపిటీషన్ బాగానే ఉంది. మరి ఇలా అయితే రాను రాను రష్మిక కి మిగతా హీరోయిన్స్ తాకిడి గట్టిగానే ఉంటుందని అంటున్నారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!