సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూఇయర్ వేడుకలకు పోలీసులు బ్రేక్ వేశారు. నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు లేవని సీపీ సజ్జనార్ ప్రకటించారు.ఎలాంటి ఈవెంట్లకు సైబరాబాద్ పరిధిలో అనుమతి లేదని సజ్జనార్ స్పష్టం చేశారు.
అనుమతి ఇచ్చిన సమయం వరకు మాత్రమే పబ్బులు నడపాలని తెలిపారు. రిసార్ట్స్, పబ్బులు, స్టార్ హోటళ్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని సజ్జనార్ చెప్పారు. డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని సజ్జనార్ వెల్లడించారు. సీపీ ప్రకటనలో నగర ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పటికే న్యూఇయర్ సెలబ్రేషన్ ల ఏర్పాట్లకు సిద్ధమవుతున్న ఈవెంట్స్ నిర్వహకులు, రిసార్ట్స్ యజమానులు, పబ్ ల నిర్వహకులు సీపీ ప్రకటనతో ఖంగుతిన్నారు.