ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ప్లస్ షో బుల్లితెరపై హడావుడి చేస్తోంది. బిగ్ బాస్ సీజన్ అయిపోగానే.. డ్యాన్స్ ప్లస్ షో స్టార్ మాలో ప్రారంభం అయింది. డ్యాన్స్ ప్లస్ షోలో రఘు మాస్టర్, యష్ మాస్టర్, ముమైత్ ఖాన్, మోనల్ గజ్జర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
రఘు మాస్టర్, యష్ మాస్టర్.. ఇద్దరికీ ఎంత రాపో ఉంటుందో అందరికీ తెలుసు. వాళ్లిద్దరి మధ్య బాండ్ కూడా అలాగే ఉంటుంది. అయితే.. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే.. బుల్లితెర ప్రేక్షకులు షాక్ అవ్వాల్సిందే. ఓ కంటెస్టెంట్ పర్ ఫార్మెన్స్ విషయంలో రఘు మాస్టర్, యష్ మాస్టర్ మధ్య తేడాలు వచ్చాయి. రఘు మాస్టర్ మాత్రం ఆ కంటెస్టెంట్ సరిగ్గా పర్ ఫార్మ్ చేయలేదంటే.. యష్ మాస్టర్ మాత్రం.. తను బాగానే చేసిందని.. తాను డిఫరెంట్ గా ట్రై చేసిందని.. మిగితా కంటెస్టెంట్లే ఒకే విధంగా పర్ ఫార్మ్ చేశారని యష్ మాస్టర్ అనడంతో.. ఇద్దరి మధ్య వివాదం ముదిరింది.
మధ్యలో మరో జడ్జి కల్పించుకొని.. ఏదో అనబోతే.. ముందు నన్ను మాట్లాడనివ్వండి. నేను మాట్లాడుతున్నాను కదా.. అంటూ రఘు మాస్టర్ అనడం.. మొత్తం మీద ప్రోమో మాత్రం హీటెక్కించింది. అసలు.. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా డ్యాన్స్ ప్లస్ పూర్తి ఎపిసోడ్ ను చూడాల్సిందే.