మెగా హీరోలెంత మందీ ఉన్నారు.. అని ఎవరైనా క్వశన్ వేసుకుంటే 10 మంది అని లెక్క తేలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ వరకు అందరి సినిమాలు 2021 లో రాబోతున్నాయి. చెప్పాలంటే 2021 లో సగం సినిమాలు మెగా ఫ్యామిలీ హీరోలవే అని తెలుస్తోంది. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న వకీల్ సాబ్ ముందు రాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 9 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో మే 9 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని రాం చరణ్ – నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన కూడా ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కాకుండా క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ నటించిన రెండవ సినిమా కూడా సమ్మర్ లోపు రిలీజ్ కాబోతుందట. ఇక రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ సమ్మర్ అంటే జూన్ లేదా జూలై లో విడుదలయ్యే అవకాశం ఉంది.
కిరణ్ దర్శకత్వంలో వరుణ్ బాక్సర్ గా నటించనున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతోపాటు ఎఫ్ 2 సీక్వెల్ లో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ ఏడాదే వరుణ్ నుంచి ఈ రెండు సినిమాల్య్ రాబోతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప ‘ ఈ ఏడాది లోనే రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియన్ సినిమాగా 5 భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఇక సాయి తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో చేస్తున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా విజయదశమి కి రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారట. చిరంజీవి చిన్న అల్లుడు సూపర్ మచ్చి సినిమా కూడా ఈ ఏడాదే రాబోతోంది.