Nimmagadda : రాష్ట్ర ప్రభుత్వం govt, ఎస్ఈసీ SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ nimmagadda ramesh kumar మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ సహనంతో నెట్టుకువస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రెస్టేషన్ కు లోనయ్యారని తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా నిమ్మగడ్డ సహనంతోనే ఉన్నారు. అయితే మీడియాతో మాట్లాడవద్దనే ఆంక్షలను మాత్రం యథాతధంగా కోర్టు ఉంచినందుకు నిమ్మగడ్డ కొంత ఊరట చెందారు. అయితే తనకు బాగా కావాల్సిన ఓ ఐఎఎస్ అధికారి పై ప్రభుత్వం వేటు వేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ కారణంగా నిమ్మగడ్డ ఏకంగా బదిలీలపై కొత్త మార్గద్శకాలను విడుదల చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ప్రభుత్వ అధికారులను వారి సాధారణ పదవీ కాలం పూర్తి కాకుండా బదిలీ చేయడానికి వీలులేదని, ఒక వేళ బదిలీ చేయాల్సి వస్తే అందుకు తగిన కారణాలు పేర్కొనాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విషయంలోకి వెళితే.. తిరుపతి జేఇఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఎఎస్ అధికారి బసంత్ కుమార్ నెల్లూరు జిల్లాలో ఎన్నికల పరిశీలకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుపతి పర్యటనకు వెళ్లిన సమయంలో బసంత్ కుమార్ ఆయనతో పాల్గొన్నారు. తిరుచానూరు, తిరుపతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు దర్శన ఏర్పాట్లు చూసే అధికారులు ఉన్నప్పటికీ బసంత్ కుమార్ ఆయనతో పాటు వెళ్లి ఏర్పాట్లు పర్యవేక్షించారు. నెల్లూరు జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉండాల్సిన బసంత్ కుమార్ తిరుపతికి వచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటనలో పాల్గొనడాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం తెలుసుకుంది. అంతకు ముందే బసంత్ కుమార్ ను జిల్లా కలెక్టర్ గా పంపాలంటూ నిమ్మగడ్డ సిఫార్సు కూడా చేశారు. బసంత్ కుమార్ నిమ్మగడ్డకు అనుకూలమని భావించిన ప్రభుత్వం వెంటనే ఆయన్ను తిరుపతి జేఇఓ పోస్టు నుండి బదిలీ చేస్తూ జేఏడిలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికల అబ్జర్వర్ గా బాధ్యతలు నిర్వహించవచ్చని పేర్కొంది. తాను అందలం ఎక్కించాలనుకున్న అధికారిపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంపై నిమ్మగడ్డ ప్రెస్టేషన్ కు గురయ్యారు. వెంటనే బదిలీలపై ఆంక్షలు విధిస్తూ మార్గదర్శకాలను విడుదల చేశారు.
ఎన్నికల పరిశీలకులుగా ఉన్న వారిని ఇకపై తమ అనుమతి లేకుండా బదిలీ చేయకూడదంటూ ప్రభుత్వానికి సూచించారు నిమ్మగడ్డ. ఒక వేళ బదిలీలు చేస్తే తాను రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 కే నుండి 243 జడ్ ఏ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని వారిని తిరిగి పాత స్థానాల్లోనే కొనసాగించేలా ఆదేశాలు ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంలోనే సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఓ తీర్పును ఉదహరించారు నిమ్మగడ్డ.