Nagarjuna : నాగార్జున – గోపీచంద్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ కాబోతున్నాయన్న లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’. నవంబర్ లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. కాగా ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సయామీ ఖేర్ ‘రా’ ఏజెంట్ గా కనిపించబోతోంది. వాస్తవంగా నాగార్జున వైల్డ్ డాగ్ ఓటీటీలో రిలీజ్ కాబోతోందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాని మేకర్స్ ఇప్పుడు వైల్డ్ డాగ్ ని థియేటర్ లోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇందుకు ఏప్రిల్ 2న డేట్ లాక్ చేసుకున్నట్టు సమాచారం. త్వరలో అఫీషియల్ గా వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారని సమాచారం.
Nagarjuna : నాగార్జున – గోపీచంద్ మధ్య బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతోంది.
అయితే ఇదే రోజు యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని సమాచారం. యంగ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతోంది. గోపీచంద్ – తమన్నా కబడ్డీ కోచ్ లు గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద నాగార్జున – గోపీచంద్ గట్టి పోటీ ఉండబోతోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!