Yuvraj Sing : ఒకానొక సమయంలో ఇండియా టీం లో కీలకంగా రాణించిన క్రికెటర్ యువరాజ్ సింగ్.Yuvraj Sing 2011 వ సంవత్సరంలో జరిగిన ప్రపంచ కప్ లో ఇండియా గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆ సమయంలో ఒంట్లో క్యాన్సర్ ఉన్నా గానీ.. యువరాజ్ ఆడిన ఆట ఇండియా ని ప్రపంచ కప్ గెలిచే విధంగా చేసింది. ఎడమ చేతి వాటం కలిగిన యువరాజ్ ఆల్ రౌండర్ గా టీంలో రాణించడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రిటైర్ అయ్యి ఐపీఎల్ మ్యాచ్లు ఆడుకుంటూ కాలం గడుపుతున్న.. యువరాజ్ పై గతంలో ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయనకు తిప్పలు తెచ్చి పెట్టింది. పూర్తి విషయంలోకి వెళితే హర్యానా పోలీసులు యువరాజ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత ఏడాది చాహల్తో ఇన్స్టా లైవ్ సెషన్లో పాల్గొన్న యువీ సామాజిక వర్గం పేరుతో వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.
యువరాజు చేసిన వ్యాఖ్యలపై ఓ లాయర్ పోలీసులను ఆశ్రయించడంతో దానితో హాన్సీ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గత ఏడాది లాక్ డౌన్ టైములో రోహిత్ శర్మతో కలిసి యువరాజ్ లైవ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో టీమ్ లో మరో ఆటగాడు యజువేంద్ర చాహల్ ను ఉద్దేశించి యువరాజ్ సింగ్ కీలక కామెంట్ చేశాడు. దీంతో అప్పట్లో యువరాజ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సోషల్ మీడియాలో అనేక మంది మంది పడటంతో స్వయంగా యువరాజు వివరణ ఇవ్వటమే కాక క్షమాపణలు కూడా కోరడం జరిగింది. బడుగు బలహీన వర్గాలను టార్గెట్ చేసుకుని యువి వ్యాఖ్యలు చేసినట్లు అప్పట్లో చాలామంది మండిపడ్డారు. ఇలాంటి తరుణంలో నిమ్న కులాలను లక్ష్యం చేసుకుంటూ యువరాజ్ సింగ్ అహంకారపూరితంగా మాట్లాడాడు అంటూ తాజాగా ఓ న్యాయవాది పోలీసులను ఆశ్రయించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు యువరాజ్ సింగ్ కి నోటీసులు పంపారు.