Governor : తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతుల హత్య ఉదంతంలో పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కొన్ని విషయాలను రాబట్టారు. అయితే, ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. వామన్రావు దంపతుల హత్యపై విచారణ వేగవంతం చేయాలని లేఖలో ప్రభుత్వానికి ఆమె కోరారు.
Governor గవర్నర్ మేడం ఏమంటున్నారంటే…
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై గవర్నర్ సమీక్షించారు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. పుదుచ్చేరి రాజ్ నివాస్ నుండి హైదరాబాద్ లోని రాజ్ భవన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంథనిలో జరిగిన న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నేపథ్యంలో త్వరితగతిన విచారణ కోసం చొరవ తీసుకోవాలని లేఖ రాశారు. వామన్రావు కేసులో దోషులకు శిక్ష పడేలా చూడాలని.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని లేఖలో పేర్కొన్నారు.
సంచలన విషయాలు …
వామన్రావు దంపతుల హత్య కేసులో ఇప్పటికే సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. ముగ్గురు నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించాలంటూ మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన మంథని కోర్టు.. ముగ్గురు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది.. ఏడు రోజుల పాటు నిందితుల విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో.. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు..
మైండ్ పోయే నిజాలు…
4 నెలల క్రితమే వామన్రావును హతమార్చేందుకు యత్నించినట్లు నిర్ధారణ అయింది. బిట్టు శ్రీనును అరెస్ట్ చేసిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనుతో బిట్టు శ్రీనుకు ఆరేళ్ల క్రితం స్నేహం ఏర్పడింది. ఇద్దరూ మద్యం తాగే సమయంలో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకునే వారు. ఈ క్రమంలోనే వామనరావు దంపతుల గురించి చర్చకు వచ్చింది.
గ్రామంలో తన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నట్లు భావించిన కుంట శ్రీను.. బిట్టు శ్రీనుతో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. నాలుగు నెలల క్రితమే.. గుంజపడుగు వచ్చిన వామన్రావును హత్య చేసేందుకు కుంట శ్రీను యత్నించాడు. కానీ, ప్లాన్ సక్సెస్ కాలేదు.. అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు తొలగించుకుంటే కాని తమకు భవిష్యత్తు ఉండందని అనుకుని..
ఒకేసారి ఆ న్యాయవాద దంపతులను దారుణంగా హత్య చేశారు. ఇక, దంపతుల హత్య కేసులో ముందుగా కుంట శ్రీను, చిరంజీవిలతో పాటు కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిచ్చిన సమాచారం ఆధారంగా బిట్టు శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత బిట్టు శ్రీను ఎవరెవరితో మాట్లాడాడో డేటా సేకరించారు. రిమాండ్లో ఉన్న నిందితుల ఫోన్ డేటాపై కూడా దృష్టి పెట్టారు.