Vote: కొత్తగా ఓటు హక్కు వచ్చినవాళ్లు ఓటువేయడానికి వెళ్లాలంటే కొన్ని సందేహాలు కలుగుతాయి. కాబట్టి ఓటేసేవాళ్లు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుని ఉంటే మంచిది. ఓటు హక్కు ,రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కు ను మనం ఖచ్చితం గా వినియోగించుకోవాలి. పోలింగ్ స్టేషన్ కువెళ్ళటానికి ముందే ఓటర్ల జాబితా లో మీ పేరు రిజిస్టర్ చేసి ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి .ఆ వివరాలు తెలుసుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్లో వెతుక్కోవచ్చు . లేదంటే మీ దగ్గరలో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్లి చెక్చేసుకుని తెలుసుకోవాలి.
ఓటు వేయడానికి వెళ్లేటప్పుడుమీతోపాటు ఖచ్చితం గా ఏదో ఒక ఐడీ కార్డు తీసుకువెళ్ళండి. అది ఓటర్ ఐడీ ,ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్,బ్యాంకు పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పోస్ట్ ఆఫీసు పాస్ బుక్,ఒక వేళా మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే.. ఎంప్లాయి ఐడీ లో ఏదో ఒకటివెంటతీసుకు వెళ్ళాలి.వీటి తో పాటు ఓటరు స్లిప్ కూడా మీతో తీసుకువెళ్లాలి. ఒక వేళా మీకు ఓటరు స్లిప్ ఎవరూ ఇవ్వకపోతే.. పోలింగ్ బూత్ దగ్గర ఉండే కౌంటర్ల లోతీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
పోలింగ్ బూత్ కు వెళ్ల గానే క్యూ లో నిలబడి ఉన్నపుడే మీ ఐడీ, ఓటర్ స్లిప్ ను సిద్ధం గా ఉంచుకోండి. లోపలికి వెళ్ల గానే ఓటరు జాబితా లో మీ పేరు నమోదై ఉందొ లేదో చెక్చేస్తారు. మీ పేరు ఉన్నట్లయితే,వెంటనే మరో అధికారి దగ్గరికి మిమ్మ ల్ని పంపుతారు. ఆ అధికారి మీ ఎడమ చేయి చూపుడు వేలు కు సిరా మార్క్ పెట్టి ఆ తర్వాత మీకు ఓ స్లిప్ ఇస్తారు.
ఆ చీటి ని ఇంకో అధికారికి ఇవ్వాలి. దీంతో అక్కడ ఉన్న అధికారి మీకు ఓటు వేయడానికి పర్మిషన్ ఇస్తారు . అప్పుడు మీరు ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్లి మీకు నచ్చిన వారికి ఓటేయవచ్చు. దాని తర్వాత వీవీప్యాట్ దగ్గరికి వెళ్లవలిసి ఉంటుంది. అక్కడ మీరు ఏ అభ్యర్థికైతే ఓటు వేస్తారో దానికి సంబంధించిన స్లిప్ 7 సెకండ్ల పాటు మీకు కనిపిస్తుంది. తర్వాత అది వేరే బాక్స్ లో పడిపోతుంది. అంతే అక్కడితో మీరు ఓటు వేసే ప్రక్రియముగుస్తుంది.
ఒకవేళ మీరు ఓటేసిన పార్టీ, వీవీప్యాట్ స్లిప్ లో కనిపించిన పార్టీ వేర్వేరుగా ఉంటే మాత్రం వెంటనే పోలింగ్ అధికారుల కు ఫిర్యాదు చేయండి. ఒకవేళ టెక్నికల్ సమస్య వల్ల అలా జరిగి ఉంటే వాళ్లు వెంటనే దాన్నిసవరిస్తారు.