Jubilee hills housing society : హైదరాాబాద్ జూబ్లీహిల్స్ సహకార హౌసింగ్ సొసైటీ ఎన్నికలలో జూబ్లీహిల్స్ వెల్పేర్ సొసైటీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. గత 15 ఏళ్లుగా ఉన్న కమిటీ ఒక ప్యానెల్ గా జూబ్లి హిల్స్ వెల్ఫేర్ సొసైటి మరో ప్యానెల్ గా ఏర్పడి హోరా హోరీ ప్రచారం నిర్వహించాయి. ఈ సొసైటీ పాలకమండలి కోసం రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు పోటీకి దిగడంతో ఎన్నికలు ఉత్కంఠను రేపాయి. సొసైటిలో మొత్తం 3,181 మందిని ఓటర్లుగా సహకార సంఘం గుర్తించగా ఆదివారం మధ్యాహ్నం వరకూ జరిగిన ఓటింగ్ లో 1,759 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ వెల్ఫేర్ సొసైటీ ప్యానెల్ 15 పాలకమండలి పదవుల్లో గెలుపొందింది. ఎస్సీ కోటాలో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం సతీమణి సుజాత విజయం సాధించగా, మహిళా విభాగంలో ఆదాల హిమబిందు రెడ్డి, సునీలా రెడ్డి గెలుపొందారు. ఇదే ప్యానెల్ లోని సభ్యులు రాజేంద్ర ప్రసాద్, గరకపల్లి శ్రీనివాసు, బి రవీంద్రనాధ్, మురళీముకుంద్, పి నాగరాజు, ఎం ఆనందకుమార్, ఎస్ సతీష్ చంద్ర, ఆర్ మాధవరెడ్డి, కె నాగేంద్ర ప్రసాద్, మదాడి శ్రీలక్ష్మి, డాక్టర్ ఒం ప్రకాష్ అగర్వాల్, కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కుసుమ్ కుమార్ జెట్టి విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో మంత్రి పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యుడు రవీంద్ర కుమార్, మాజీ ఎంపిలు కొండా విశ్వేశ్వరరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కావూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఏపి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీనీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, సుమంత్, త్రివిక్రమ్, దిల్ రాజు, కెఎస్ రామారావు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకరరెడ్డి, తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.