Vaccination: ఏపి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానం పలికింది. కోటి మందికి వ్యాక్సిన్ వేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. మే 13వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి టెండర్ల డౌన్ లోడ్ కు అవకాశం కల్పించింది. జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు టెండర్ల డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది. టెండర్ల టెక్నికల్ బిడ్ ను అదే రోజు సాయంత్రం 5 గంటలకు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఫ్రీ బిడ్ మీటింగ్ ను అధికారులు నిర్వహిసారు. ఈ టెండర్లలో పాల్గొనేవారు ఏపీఎంఎస్ఐడీసీ పేరుతో ఈఎండీ కింద రూ.3లక్షల డీడీ తీయాలని ప్రభుత్వం సూచించింది.