Black Fungus:ఓవైపు కరోనా కలకలం కొనసాగుతుంటే మరోవైపు కోవిడ్ నుంచి కోలుకున్న కొన్ని కేసుల్లో బ్లాక్ ఫంగస్ సమస్య మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధికి చికిత్స వంటి విషయాల్లో ఉన్న అస్పష్టతలపై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. బ్లాక్ ఫంగస్ భారిన పడితున్న వారిలో ఎక్కువగా ఈఎన్ టి సమస్యలు ఉన్నాయని..ఈ క్రమంలోనే ఈఎన్ టి హాస్పిటల్ ను నోడల్ కేంద్రంగా సర్కారు ప్రకటించినట్లు తెలిపారు. బ్లాక్ ఫంగస్ భారిన పడి, కోవిడ్ పాజిటివ్ గా ఉన్న వారికి గాంధీలో చికిత్స అందించనున్నట్లు తెలిపింది.
చికిత్స ఇలా…
బ్లాక్ ఫంగస్ భారిన పడ్డవారు ఆప్తల్మాలజీ డాక్టర్ అసవరం ఉంటే, సరోజిని దేవి ఆసుపత్రిలో సేవలు వినియోగించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ మేరకు గాంధీ, సరోజిని దేవి, కోటి ఈ ఎన్ టి ఆస్పత్రుల సుపరిండెంట్ లు తగిన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కి వినియోగించే మందులు టిఎస్ఎంఐడిసి ద్వారా సమకూర్చుకున్న్టలు తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసులకు పూర్తిగా కోటి ఈఎన్ టిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపిన డీఎంఈ.. కోవిడ్ పాజిటివ్ గా ఉండి బ్లాక్ ఫంగస్ సమస్య ఉన్న వారికి ప్రత్యేక గదిలో ట్రీట్ మెంట్ ఉంటుందని తెలిపింది.
ప్రైవేట్ హాస్పిటల్స్ కు కీలక ఆదేశం
కరోనా సమయంలో బ్లాక్ ఫంగస్ రాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ స్పెషల్ కేర్ తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. ఈ మేరకు ఆయన ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ భారిన పడిన కొందరిలో బ్లాక్ ఫంగస్ సమస్యను గుర్తించినట్టు ప్రకటించిన సిహెచ్ శ్రీనివాస రావు కోవిడ్ రోగులకు చికిత్స అందించే సమయంలో షుగర్ లెవల్ ని సరిగా అదుపు చేయాలని డాక్టర్లకు సూచించారు. షుగర్ లెవల్ ని కంట్రోల్ చేసేందుకే అవసరమైతే స్టిరాయిడ్ లను వాడాలన్నారు. యాంటి ఫంగల్, యాంటీ బియోటిక్ మందులు కూడా వాడాలని ఆదేశాలిచ్చారు.