Virushka: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ కరోనాపై పోరుకు సై అన్నారు.. కోవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు రూ.7 కోట్ల విరాళం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకు తమ వంతుగా రూ.2 కోట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ రెండేళ్ల చిన్నారి వైద్యానికి అవసరమయ్యే రూ.16 కోట్లను సమకూర్చారు విరుష్క జోడి..!! ఢిల్లీకి చెందిన అయాన్ష్ గుప్తా అనే చిన్నారి వెన్నుముక కండరాలకు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.. ఈ వ్యాధి చికిత్సకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘జోల్గెన్స్ మా’ అనే మెడిసిన్ అవసరం..!!
Read More: ఒక్క నిమిషంలోనే కరోనా రిజల్ట్..!!
ఇంత ఖరీదైన మెడిసిన్ కొనుగోలు చేయడానికి స్తోమత లేని ఆ తల్లిదండ్రులు ట్విట్టర్ వేదికగా తమ గోడు వెళ్లబోసుకున్నారు.. సహాయం అందించండి అంటూ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న విరుష్క జోడి స్వయంగా సహాయం చేయడంతో పాటు తమ అభిమానులను కూడా ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు.. దీంతో సోమవారం నాటికి రూ.16 కోట్ల నిధులు సమకూరాయి. ఆ చిన్నారి తల్లిదండ్రులు విరాట్ కోహ్లీ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటివరకు విరుష్క జోడీకి అభిమానులమని, ఇప్పటినుంచి ఆరాధిస్తామని ట్విట్టర్ వేదికగా తమ ఆనందాన్ని తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు విరుష్క జంటను ప్రశంసిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంతకుముందు కూడా మహిళా క్రికెటర్ స్రవంతి తల్లి కరోనా చికిత్స కోసం రూ.6.77 లక్షల సహాయాన్ని అందించి తన పెద్దమనసు చాటుకున్నాడు.