దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో విబ్రి మీడియా పతాకంపై విష్ణు ఇందూరి నిర్మాతగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ను రూపొందిస్తారని చాలా రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అసలు అమ్మగా ఎవరు నటిస్తారనే దానిపై యూనిట్ చాలా అన్వేషించింది. విద్యాబాలన్, ఐశ్వర్యారాయ్, సోనాక్షిసిన్హా తదితరులు నటిస్తే ఎలా ఉంటుంనే యూనిట్ సభ్యులు డిస్కస్ కూడా చేసుకున్నారు. అయితే ఎఐడిఎంకె అధినేత్రి, అమ్మ జయలలిత బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించనున్నారు. దాదాపు ఈ విషయమై అధికారిక సమాచారం మాత్రమే వెలువడాల్సి ఉంది. మణికర్ణిక విజయం కూడా కంగనాకు ఈ సినిమా అవకాశం రావడంలో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. మణికర్ణికకు కథను అందించిన రచయిత విజయేంద్ర ప్రసాదే కంగనా పేరును యూనిట్కు సూచించాడని కూడా వార్తలు వినపడుతున్నాయి. దర్శక నిర్మాతలు కూడా కంగనా అయితే అటు బాలీవుడ్లో క్రేజ్ బాగానే ఉంటుందని ఆమె సంప్రదించి ప్రాజెక్ట్ ఓకే చేయించారట.
ఇప్పటికే జయలలితపై రెండు బయోపిక్స్ రూపొందుతున్నాయి. అందులో ప్రియదర్శిని అనే మహిళా దర్శకురాలు తెరకెక్కించే `ది ఐరన్ లేడీ`లో నిత్యామీనన్ జయలలితగా నటిస్తున్నారు. మరోవైపు సీనియర్ డైరెక్టర్ భారతీరాజా కూడా జయలలిత బయోపిక్ను రూపొందించే పనిలో ఉన్నారు.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!