Tdp: తెలుగుదేశం Tdp తెలంగాణలో ఉనికి కోల్పోయిన పార్టీ.. ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉంది. 2019 ఓటమి నుంచి ఇంకా తేరుకోలదనే చెప్పాలి. చంద్రబాబు ఆధ్యక్షతన ఒంటరి పోరే సాగిస్తున్నారు. పార్టీ నేతల్లో గతంలో అధికారం చెలాయించిన వారిలో చాలామంది సైలెంట్ గానే ఉండిపోయారు. తమ ప్రాభవంతో గెలిచిన వారి వాయిస్ మాత్రమే వినపడుతోంది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో, పార్టీని కొత్తగా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంలో అచ్చెన్నాయుడికి పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అచ్చెన్న కూడా ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. అయితే.. పార్టీలో లోకేశ్ తో ఆయనకు పొసగడం లేదనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికీ మధ్య దూరం పెరిగిందనేది పార్టీ శ్రేణుల్లో అనుకుంటున్న మాట. ఇందుకు కారణం లేకపోలేదు..
ఆమధ్య పార్టీ గురించి అచ్చెన్నాయుడు చేసినట్టుగా వైరల్ అయిన వ్యాఖ్యలపై లోకేశ్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై పార్టీ, చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు.. పబ్లిగ్గా స్పందించింది లేదు. అయితే.. పార్టీకి డ్యామేజ్ మాత్రం జరిగింది. నేతలు, కార్యకర్తల్లో ఈ మాటలు ప్రభావం చూపిస్తే.. ప్రజల్లోకి మరోలా వెళ్లాయని చెప్పాలి. అప్పటి నుంచే అచ్చెన్నతో లోకేశ్ కాస్త దూరం పాటిస్తున్నారని తెలుస్తోంది. అయితే.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే లోకేశ్ తీరు చర్చాంశనీయమైంది. తాడేపల్లిలోని కేఎల్ యూనివర్శిటీలో పార్టీ క్రమశిక్షణా మీటింగ్ జరిగినప్పుడు అప్పటి హోంమంత్రి చినరాజప్పపై లోకేశ్ దబాయించారనే వార్త అప్పట్లో హైలైట్ అయింది. అప్పట్లోనే యనమలకు కూడా లోకేశ్ తీరు నచ్చేది కాదని.. వారిమధ్య కూడా సఖ్యత ఉండేది కాదని వార్తలు వచ్చాయి.
Read More: Nara Lokesh: 2024 ఎన్నికలు..! లోకేశ్ ఆలోచన మారుతోందా..?
పార్టీ అధ్యక్ష పదవిని లోకేశ్ తాను సూచించిన వ్యక్తికే కట్టబెట్టేలా చక్రం తిప్పాలనే ప్రయత్నాలు చేసారని అంటారు. పార్టీలో తన ముద్ర ఉండేలా చూసుకోవడంలో భాగంగా లోకేశ్ చేసుకున్న ప్రయత్నాలని చెప్పాలి. ఇటివల జరిగిన మహానాడులో కూడా పార్టీలోకి యువరక్తం అవసరమని బాలకృష్ణ ఆమధ్య అన్నారు. ఈక్రమంలోనే పార్టీలో లోకేశ్ తనదైన ముద్ర వేసుకునే క్రమంలో అచ్చెన్న చేసిననట్టు వైరల్ అయిన వ్యాఖ్యలపై ఇప్పటికీ గుర్రుగా ఉన్నారనే టాక్ ఉంది. మరి.. వీరిమధ్య వైరం ఉందనే మాటల్లో ఎంత నిజముందో కానీ.. వైరం ఉన్నా గుంభనంగా ఉండటమే ఉత్తమం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో వైరం బయటకు వస్తే.. ప్రజల్లోకి కొత్త సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది..!