Flash News: దొంగలను పట్టుకోవలసిన పోలీసులే దొంగలుగా మారిపోయారు. విషయంలోకి వెళితే ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. రోడ్డు పక్కన చిరువ్యాపారి దుకాణం నుంచి ఏఆర్ పోలీసులు బట్టలు ఎత్తి కలవడం జరిగింది. సాక్షాత్తు ఓ ఎస్ఐ చేతివాటం చూపించడం జరిగింది. అది కూడా రోడ్డు పక్కనే ఉన్నటువంటి చిన్న దుకాణంలో.
రాత్రుళ్లు పెట్రోలింగ్ చేసే సమయంలో బట్టల షాపులోకి వెళ్లి పోలీసులు దొంగతనం చేశారు. దీంతో ఆ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఈ ఘటన ఈనెల 4వ తారీఖున జరిగింది. మొత్తం ఇద్దరు పోలీసులు .. దొంగతనం చేసి పట్టుబడటంతో షాపు యజమాని సీసీ కెమెరాల ఆధారంగా పోలీస్ కంప్లైంట్ చేయటంతో.. సదర్ ఇద్దరు పోలీసులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.