Breaking: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. మురళి సినిమా టిక్కెట్ల విక్రయాలు విషయంలో.. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ విధానం తీసుకురాగా నిన్న మటన్ మార్ట్ లు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయాలలో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త చీఫ్ సెక్రెటరీ గా డాక్టర్ సమీర్ శర్మ ఐఏఎస్ నీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఈనెల చివరాఖరున రిటైర్ అవుతున్న నేపథ్యంలో…. ఆయన స్థానం లోకి అక్టోబర్ మొదటి తారీకు నుండి డాక్టర్ సమీర్ శర్మని నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.