Bigg Boss 5 Telugu: ఐదో వారం బిగ్ బాస్ హౌస్ లో 32 వ రోజు జరిగిన ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్క్ లో… రవి అదేరీతిలో సన్నీ జట్ల సభ్యులు ఒకరితో ఒకరు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. ఎవరూ కూడా తగ్గలేదు. ముఖ్యంగా కుస్తీ పోటీల ప్రారంభానికి ముందే.. ఇరు జట్ల సభ్యుల ఆటగాళ్లు ఎవరికి వాళ్లు స్ట్రాటజీ లు వేయడం జరిగింది. రవి జట్టు సభ్యులు చాలా తెలివిగా ఆడిన గాని.. సన్నీ టీం లో ఉండే వాళ్ళు కలిసికట్టుగా ఆడటంతో.. సన్నీ రాజ్యం విజయాలతో దూసుకుపోతుంది.
యాని మాస్టర్ నీ… నేలకేసి బాదాడు
ఈ క్రమంలో కుస్తీ నీ ఆట సమయంలో రవి రాజ్యం నుండి యానీ మాస్టర్ బరిలోకి దిగగా.. సన్నీ రాజ్యం నుండి జెస్సీ కుస్తీ రింగ్ లోకి వచ్చాడు. ఈ క్రమంలో… అప్పటికే యానీ మాస్టర్ గేమ్ ఆడకూడదని డిస్కషన్లు జరిగాయి. దీంతో యానీ మాస్టర్… తనతో తలపడతాకి వచ్చిన జెస్సి మీదకు వెళ్లగా… జెస్సి బాగా హైట్ కావటంతో..యాని మాస్టర్ నీ… నేలకేసి బాదాడు. ఒకే దెబ్బతో యానీ మాస్టర్ నీ కుస్తీ పోటీలో పడుకో పెట్టడం జరిగింది. దీంతో సన్నీ టీం గెలిచింది.
రెండు రాజ్యాల మధ్య జరిగిన కుస్తీ పోటీ
అంతకు ముందే రవి టీం నుండి విశ్వ రాగా.. సన్నీ టీం నుండి మానస్ వచ్చి మొదటి రౌండ్ గేమ్ ఆడగా.. ఇద్దరు నువ్వానేనా అన్నట్టుగా భారీగా తలపడగా విశ్వ గెలిచారు. ఇక మూడో రౌండ్ లో.. సన్నీ టీం నుండి పింకీ రాగా.. రవి టీం నుండి శ్వేత వచ్చింది. ఈ క్రమంలో ఈ రౌండ్ లో శ్వేతా గెలిచింది. మొత్తానికి రెండు రాజ్యాల మధ్య జరిగిన కుస్తీ పోటీలో రవి జట్టు అత్యధిక పాయింట్లతో గెలిచింది. ఇదిలా ఉంటే యాని మాస్టర్ నీ.. నేలకేసి అదిమిన తరువాత జెస్సి గెలిచిన తర్వాత వినమ్రంగా..యానీ మాస్టర్ కాళ్ళకి దండం పెట్టడం జరిగింది. పెద్దవారు కావటంతో గెలిచిన తర్వాత జేస్సి నార్మల్గానే గేమ్ నీ తీసుకున్నాడు. యానీ మాస్టర్ కూడా లైట్ గా తీసుకోవటం విశేషం.