Mahesh Trivikram : త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా.. షూటింగ్ పూజా కార్యక్రమం ఫిబ్రవరి మూడవ తారీఖు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ మినహ భార్య నమ్రత అదేవిధంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంక నిర్మాతలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే సినిమాల్లో… సెకండ్ హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ చిన్న చేంజ్ చేసినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
మొదటి లో మలయాళం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ ని తీసుకోవాలని ప్లాన్. మహేష్ మరదలుగా ఆ పాత్ర ఉంటుందని వార్తలు రాగా ఇప్పుడు ఆ ప్లేస్ లోకి… బెంగళూరు బ్యూటీ శ్రీలీ లను.. తీసుకునే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం. “పెళ్లి సందడి” సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన … శ్రీలీల గ్లామర్ పరంగా.. తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో మహేష్ మరదలుగా త్రివిక్రమ్ తీసుకోవడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీ టాక్.
శ్రీలీల… మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో చేస్తూ ఉంది. కాగా మూడో సినిమాతోనే మహేష్ బాబు తో… అవకాశం అందుకోవటం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మార్చి రెండవ వారం నుండి స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమానీ సమ్మర్ కానుకగా మే 12వ తారీకు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!