pataas-2: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `పటాస్`. యన్.టి.ఆర్. ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో సృతి సోధి హీరోయిన్గా నటించింది. సాయి కుమార్ కీలక పాత్రను పోషించారు. 23 జనవరి 2015లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
అప్పటి వరకు వరుస ఫ్లాపులతో సతమతం అయిన కళ్యాణ్ రామ్ `పటాస్`తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. రొటీన్ కథే అయినా సరికొత్త కామెడీ సీన్స్, పరిగెత్తించే కథనం సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే ఇప్పుడీ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్గా `పటాస్-2` రాబోతోంది.
ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా కన్ఫార్మ్ చేశారు. అనిల్ రావిపూడికి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చినది నందమూరి కల్యాణ్ రామే. అయితే ఆయనతో పటాస్ తర్వాత అనిల్ మరో మూవీ చేయలేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై అనిల్ రావిపూడి స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. `కళ్యాణ్ రామ్ గారికి, నాకు మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు. పటాస్ సక్సస్ తర్వాత కలిసి ఇంకో సినిమా చేద్దాం అనుకున్నాం. మా మధ్య చాలా కథలు చర్చకు వచ్చినప్పటికీ.. సినిమా చేయడం కుదరలేదు. కానీ, మా ఇద్దరి కాంబోలో తప్పకుండా ‘పటాస్ 2’ ఉంటుంది.` అని చెప్పుకొచ్చాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, అనిల్ రావిపూడి ప్రస్తుతం `ఎఫ్-3` చేస్తున్నాడు. ఇది పూర్తి అయిన వెంటనే బాలయ్యతో ఓ మూవీ చేయనున్నాడు. ఆ తర్వాత పటాస్-2 స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!