Intinti Gruhalakshmi: తులసి కోట దగ్గర పూజ చేస్తున్న తులసి అభి మారిపోయినట్టుగానే ప్రేమ్ జీవితం కూడా బాగుండాలని.. తులసి దండం పెట్టుకోగానే తులసి కోటలో దీపం కొండెక్కింది.. పండగ రోజు ఏదో అశుభం జరుగుతుందని సంకేతం లాగా ఉంది ఇలాంటివి ఏమీ జరగకుండా ప్రశాంతంగా ఉండేలా చూడు తల్లి అని మనసులో దండం పెట్టుకుంటుంది.! ఇలా నేటి ఎపిసోడ్ మొదలవుతుంది..!
నేటి 571వ ఎపిసోడ్ హైలెట్స్..!! ఊహించని ట్విస్ట్స్..!!
లాస్య నందు ఇద్దరు వచ్చి హాల్లో కాఫీ రాములమ్మ అని కూర్చుంటారు.. నందు నా వాట్సాప్ డిపి మార్చి చాలా రోజులైంది. అన్ని ఓల్డ్ పిక్స్ ఉన్నాయి అని అంటుండగా.. వాళ్ళ మావయ్య వచ్చి ముందు వాట్స్అప్ డీపీ గురించి కాదు.. ఇంట్లో ఏం జరుగుతుందో చూడండి. ఇంట్లో అందరూ రెడీ అయి పూజకు సిద్ధంగా ఉంటే మీరు మాత్రం కాఫీ దగ్గరే ఉన్నారా.. ఈరోజు శివరాత్రి అని నాకు తెలియదు మావయ్య గారు నాతో ఒక్కరు కూడా చెప్పలేదని లాస్య అమాయకంగా అంటుండగా.. ఇలాంటివి ఎవరు చెప్పారమ్మ.. తులసి పండగ వస్తుంది అంటే ముందు నుంచే ప్లాన్ చేసుకుంటుంది. నువ్వు కూడా అలా చేసుకోవాలి కదా.. ఎప్పటికి మారతవో ఏంటో అని వాళ్ల మావయ్య అక్కడనుంచి వెళ్ళి పోతాడు..
లాస్య రెడీ అయ్యి వచ్చి నాకు కూడా కొన్ని పువ్వులు ఇవ్వు శృతి నేను కూడా దండ కడతాను అంటుంది. వద్దులే ఆంటీ మీరు మొన్న సంక్రాంతికి మీరు దండ కడితే దారం తప్ప పువ్వులు మిగల్లేదని పకపకా నవ్వుతుంది శృతి.. లాస్య ఎందుకు ఈ పనులు పూజ అయిపోయాక ప్రసాదం తిను పూజ చేసిన పుణ్యం అని ప్రేమ్ అంటాడు. సరే వీళ్ళతో కాదులే.. వంటలు చేసి అందర్నీ బుట్టలో వేసుకుంటాను అని వంటగదిలోకి వెళ్లి.. రాములమ్మ లిస్ట్ చెప్తాను ఆ వంటలన్నీ నడిచే అంటుంది అది ఏంటమ్మా వంటలు అన్నీ సిద్ధం చేశాను కదా.. వంటలు చేయాలి అనుకుంటే ఉదయం నాలుగు గంటలకే లేచి రావాలి. ఈసారి పండగకు అలా ప్లాన్ చేసుకోవాలని తులసి అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పూజకు కావలసిన ఏర్పాట్లు చేద్దామని అంటుంది. ఈ ప్రసాదం పెడితే పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టే.. పూజ అయిపోయాక ప్రసాదం తినండి అని పడింది ఇంట్లో అందరూ కలిసి పూజ చేసి హారతి తీసుకుంటారు అంకిత అందరికీ ప్రసాదం పెడుతుంది. విచితం ఏంటంటే సరిగ్గా లాస్య దగ్గరకు రాగానే ప్రసాదం కూడా అయిపోతుంది. దాంతో లాస్య అలిగి గదిలోకి వెళ్ళి పోతుంది.
ఏమైంది లాస్య వచ్చేసావు అని అడుగుతాడు నందు ఇంట్లో నా విలువ ఏంటి నందు ఎవరికీ నేను కోడలు గా కనిపించడం లేదు నాకు దక్కాల్సిన మర్యాద తులసికి దక్కుతుంది. అలా మాట మాట పెరిగి నందు లాస్య ని తీసుకుని హాల్ లోకి తీసుకు వస్తాడు ఈరోజు లాస్య స్థానం ఏంటో ఇంట్లో అందరూ తనకి అర్థమయ్యేలా చెప్పండి. నా మాట వినట్లేదు అని నందు అంటాడు. నీ మాట వినకపోతే మాట ఎక్కడ వింటుంది అని వాళ్ళ అమ్మ అంటుంది. అయినా మర్యాద అనేది ఒకరీ దగ్గర ఆశించేటప్పుడు మనం కూడా ఎదుటి వారికి అదే ఇవ్వాలి.
మా అమ్మను ప్రశాంతంగా ఉంచలేదు. భార్యగా తనకు గౌరవం ఇవ్వలేదు. పాతికేళ్ల జీవితంలో తనకు నరకాన్ని చూపించావు. తన వైవాహిక జీవితాన్ని లాగేసుకొని లాస్య కి ఇచ్చావు. ఇప్పుడు తనకి ఉన్న ఆప్యాయతల బంధాన్ని కూడా అలాగేసుకుంటావా అని వాళ్ళ నాన్నని ప్రశ్నిస్తాడు ప్రేమ్.. ఇక నందు ప్రేమ్ కి మధ్య వార్ ఓరేంజ్ లో జరుగుతుంది. ఇక లాస్య ఆజ్యం పోయడానికి తులసిని నానా మాటలు అంటుంది. ఆ మాటలు విన్న కోపంతో ప్రేమ్ లాస్య కొట్టడానికి చేయ్యి ఎత్తుతాడు. నా భార్యని కొట్టేంత స్థాయికి ఎదిగిపోయావా అని ప్రేమ్ చెంప చెళ్లుమనిపిస్తాడు నందు.. ఇక ఈ గొడవలకు సర్ది చెప్పలేక తులసి మర్యాదగా ఇంట్లో నుంచి నీ భార్యను తీసుకొని వెళ్ళిపో ప్రేమ్ అని అంటుంది. ప్రేమ్ ఇంటిలోనుంచి వెళ్ళనని వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకుని ప్రాధేయ పడతాడు. తులసి కనికరించలేదు. దాంతో శృతిని ఇంట్లో నుంచి తీసుకుని వెళ్లడానికి ప్రేమ్ సిద్ధమవుతారు. ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!