NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly Budget Session: డ్యామేజీ కంట్రోల్ అయినట్లే(గా)..?

AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే ఇటీవల అకాల మరణం చెందిన మంత్రి గౌతమ్ రెడ్డికి మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన మృతికి అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. అయితే ఇదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, సుధీర్ఘకాలం మంత్రిగా, తమిళనాడు గవర్నర్ గా పని చేసిన రోశయ్య మృతికి అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశం పెట్టి నివాళులర్పించకపోవడం రాష్ట్రంలో ఆర్యవైశ్య సంఘీయులకు ఆగ్రహం తెప్పించింది. ఆ సంఘ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చివరి వరకూ వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉన్న రోశయ్య కు అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టకపోవడంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. రోశయ్య మృతి చెందిన సందర్భంలోనూ సీఎం వైఎస్ జగన్ వెళ్లి నివాళులర్పించకపోవడాన్ని పలువురు ఆర్యవైశ్య సంఘ నేతలు ప్రస్తావించారు.

AP Assembly Budget Session CM Jagan pays tribute former cm Rosaiah
AP Assembly Budget Session CM Jagan pays tribute former cm Rosaiah

 

AP Assembly Budget Session: ఆర్యవైశ్య సంఘ నేతల్లో నిరసన

రోశయ్యను విస్మరిస్తే ఆర్యవైశ్యులు వైసీపీకి దూరమయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆర్యవైశ్య సంఘ నేతల్లో నిరసన వ్యక్తం అవ్వడంతో వైసీపీ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో మూడవ రోజైన గురువారం నాడు కొణిజేటి రోశయ్య మృతికి సంతాప తీర్మానం ప్రవేశెట్టారు. ఈ సందర్బంలో రోశయ్య ఘనతను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కొనియాడారు. విద్యార్ధి నాయకుడు స్థాయి నుండి శాసనమండలి సభ్యుడుగా, శాసనసభ్యుడు, మంత్రిగా, ఎంపిగా, ముఖ్యమంత్రి, చివరకు గవర్నర్ గానూ కొనసాగిన ఘనత రోశయ్యది అని సీఎం జగన్ అన్నారు. ఆయన ఏ బాధ్యత నిర్వహించినా అందరికీ ఆదర్శంగా, అందరూ కొనియాడే మనిషిగానే నిలిచారని కీర్తించారు.

అయిదుగు సీఎంల వద్ద మంత్రిగా చేసిన ఘనత

నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయిదుగురు ముఖ్యమంత్రుల వద్ద ఆయన మంత్రిగా పని చేశారన్నారు. వైఎస్ఆర్ తో మంచి సంబంధాలు ఉండేవన్నారు. మంచి స్నేహితులుగా ఉండేవారనీ, అలాంటి రోశయ్య గుర ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు వైఎస్ జగన్. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి తదితరులు సంతాప తీర్మానంపై మాట్లాడారు. అదే విధంగా మృతి చెందిన పలువురు సభ్యులకు సంతాపం తెలియజేశారు.

Related posts

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?