Rashmika Mandanna: “చలో” సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన రష్మిక మందన.. వరుస బంపరాఫర్ లతో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. సమంత, కాజల్ అగర్వాల్, అనుష్క జోరు తగ్గాక.. ఇండస్ట్రీలో పూజా హెగ్డే, రష్మిక మందన హవా కొనసాగుతోంది. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవలే రష్మిక మందన సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన “పుష్ప” లో… హీరోయిన్ గా చేసి.. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించడం తెలిసిందే.
కాగా ఇప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లోనే టాప్ మోస్ట్ పాపులర్ ప్రాజెక్ట్ లో .. రష్మిక ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా… రష్మిక మందన ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న ట్లు.. పైగా తెలుగులో తన పాత్రకి విజయ్ సొంతంగానే డబ్బింగ్ చెప్పడానికి రెడీ అయినట్లు సమాచారం. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా.. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ట్లు ఈ నేపథ్యంలో ఎంతటి భారీ ప్రాజెక్టు లో రష్మిక మందన నీ… హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. “పుష్ప”తో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో రష్మిక మందన కి మంచి క్రేజ్ రావడంతో దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలా ఉంటే పుష్ప సెకండ్ పార్ట్ కి సంబంధించి త్వరలోనే ప్రారంభం కానున్న షూటింగ్ లో… మొదటి పార్టీలో భిన్నంగా… రష్మిక మందన క్యారెక్టర్ సుకుమార్ డిజైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!